Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు
- తాజాగా మరోసారి పెరిగిన పంచదార ధరలు
- కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చక్కెర ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత వరుసగా పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో పంచదార ధరలు కొండెక్కడంతో సామాన్యులు లబిదిబో అంటున్నారు.
త్వరలోనే కీలక పండుగలు రాబోతున్నాయి. ఇలాంటి తరుణంలో చక్కెర ధరలు 9 శాతం పెరిగాయి. గత నెలలో దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర సుమారుగా 6.6 శాతం పెరిగాయి. నెల రోజుల క్రితం దేశంలో చక్కెర సగటు రిటైల్ ధర కిలోకు రూ.47.17 ఉండగా.. ఇప్పుడు అది కిలోకు రూ.50.30కి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కూడా చక్కెర ధరలు సుమారుగా 9 శాతం పెరిగాయి. పండుగ సీజన్కు ముందు చక్కెర ధరలు పెరగడం సామాన్యుల గృహ బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. అయితే పెరుగుతున్న ధరలను అరికట్టడానికి ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. నిల్వలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం డీలర్ల దగ్గర పరిమితి కూడా విధించింది. చక్కెర డీలర్లకు నిల్వల పరిమితి ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు పరిమితి అమలులో ఉంటుందని తెలిపింది. దేశీయ వినియోగానికి దేశంలో తగినంత చక్కెర ఉందని, వినియోగదారులకు సరసమైన ధరలకు చక్కెర లభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ధరలు ఎందుకు పెరిగాయి?
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందించింది. ప్రభుత్వం ప్రకారం.. ఇటీవలి ఎక్స్-మిల్ చక్కెర ధరల పెరుగుదల ప్రస్తుత డిమాండ్, సరఫరా పరిస్థితికి అనుగుణంగా లేదు. కొంతమంది వ్యాపారులు, డీలర్లు, మార్కెట్ మధ్యవర్తులు చక్కెరను నిల్వ చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి తెలిసింది. అంతేకాకుండా చక్కెర సరఫరా లేకుండా జరిగే ఊహాజనిత లావాదేవీలు, కాగితపు వ్యాపారాలు మార్కెట్లో కొరతకు పూనుకుంటున్నారు. ఈ కారణాల వల్ల చక్కెర ధరలలో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయని, మిల్లు నుంచి అమ్మే ధరలతో పాటు చిల్లర ధరలు కూడా పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది.
దేశీయ అవసరాలను తీర్చడానికి దేశంలో తగినంత చక్కెర అందుబాటులో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్కెట్లో కొరత సృష్టించి ధరలను పెంచే ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, దేశంలో తగినంత చక్కెర లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్త నిబంధనల ప్రకారం.. చక్కెర వ్యాపారులందరూ ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆన్లైన్ పోర్టల్ను ఉపయోగించి ప్రతి వారం తమ చక్కెర నిల్వలను నివేదించడంతో పాటు, వాటిని నవీకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చక్కెర మార్కెట్ను నిరంతరం పర్యవేక్షిస్తూ, ధరలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చక్కెర మార్కెట్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. నిల్వలను, ఊహాగానాలను నివారించడం, మార్కెట్లో చక్కెర సరఫరా స్థిరంగా ఉండేలా చూడటం, ధరలు పెరగకుండా నిరోధించడం కోసమే నిల్వలపై పరిమితులు విధించడం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- Tags
- india
- Sugar
- SUGAR PRICE HIKE
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!