Subhas Chandra Bose: నేతాజీ అవశేషాలను తీసుకురావాలి.. ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
- నేతాజీ అవశేషాలను తీసుకురావాలి..
- ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
Subhas Chandra Bose: జపాన్లోని రెంకోజీ ఆలయంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలను వెనక్కి తీసుకురావాలని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18లోగా వెనక్కి తీసుకురావాలని కోరారు. నేతాజీపై వస్తు్న్న తప్పుడు కథనాలకు బ్రేక్ పడాలంటే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాలని ఆయన అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పారు. జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తం 10 విచారణల తర్వాత తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ ఆగస్టు 18, 1945న మరణించారని స్పష్టంగా తేలిందని చెప్పారు.
Read Also: Women’s Asia Cup Final 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళల జట్టు..
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
కాబట్టి భారత ప్రభుత్వం నేతాజీ మరణంపై తప్పుడు సమాచారం తొలిగిపోయేందుకు భారత ప్రభుత్వం తుది ప్రకటన చేయడం అత్యవసరమని చంద్రకుమార్ బోస్ ఆదివారం మోడీకి ఒక లేఖ రాశారు. నేతాజీ అవశేషాలను ఆగస్టు 18, 2024 నాటికి రెంకోజీ నుండి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేతాజీ భారత్కు తిరిగి రావాలనుకున్నారని, అయితే విమాన ప్రమాదంలో మరణించినందున కుదరలేదని చెప్పారు. రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలను ఉంచడం చాలా అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్కి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహానేత అవశేషాలు భారత నేలను తాకాలని మేము గత మూడున్నరేళ్లుగా ప్రధానికి లేఖ రాస్తున్నానని చెప్పారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు బోస్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి లేదా ప్రధాన మంత్రి నుండి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు. 1945 ఆగస్ట్లో జపాన్ లొంగిపోయిన తర్వాత జపాన్ మిలిటరీ విమానంలో తైవాన్ను వదిలి రష్యాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!