Punjab: వాలెంటైన్స్ డేకు ముందు తరగతి గదిలో రక్తపాతం.. క్లాస్మేట్ను ఎందుకు చంపాడంటే..!
- పంజాబ్ లా కాలేజీలో ఘోరం
- వాలెంటైన్స్ డేకు ముందు తరగతి గదిలో రక్తపాతం
- సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషి ఎదుగుదలలో అనేక దశలు ఉంటాయి. శిశువు.. బాల్యం.. యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం.. ఇలా ఆయా దశలుంటాయి. వీటిన్నింటిలో అత్యంత ప్రమాదర వయసు కౌమారదశ. ఈ వయసులో పుట్టె కోర్కెలు మానసిక స్థిరత్వం లేకుండా ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లి గజిబిజి చేస్తుంది. జాగ్రత్తగా ఈ స్టేజ్ దాటితో జీవితం సాఫీగా పోతుంది. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొందరు పిల్లలు యవ్వనదశలో తప్పుడు అడుగులు వేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

Also Read
పంజాబ్లోని తర్న్ తరన్ జిల్లాలో ఉన్న ‘లా’ కాలేజీ. సోమవారం ఉదయం అప్పుడే విద్యార్థులంతా క్లాస్రూమ్లోకి వస్తున్నారు. ఇంతలోనే ఒక విద్యార్థి.. సహచర విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఆమెను కాల్చి చంపి.. అనంతరం తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా పాఠాలు నేర్చుకుని గది రక్తపాతంతో నిండిపోయింది. ఈ ఘటనతో సహచర విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే రెండు విద్యాకుసుమాలు నేలరాలిపోయాయి. క్యాంపస్ అంతా భయాందోళనకు గురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
అసలేం జరిగింది..
సీసీకెమెరా రికార్డ్ ప్రకారం.. సోమవారం ఉదయం 9:16 నిమిషాలకు 20 ఏళ్ల ప్రిన్స్ రాజ్ నీలిరంగు బ్యాక్ప్యాక్తో తరగతిలోకి ప్రవేశించాడు. అప్పటికే తరగతి గదిలో 19 ఏళ్ల సందీప్ కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతోంది. ప్రిన్స్.. సందీప్ కౌర్ దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేశాడు. యథావిధిగా సందీప్ కౌర్ తన సీటు దగ్గరకు వెళ్లి కూర్చుంది. మరోసారి ప్రిన్స్.. సందీప్ కౌర్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో కోపోద్రేకుడైన ప్రిన్స్ జేబులోంచి పిస్టల్ తీసి తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చాడు.. అక్కడికక్కడే సందీప్ కౌర్ కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలింది. అనంతరం నిందితుడు ప్రిన్స్ కూడా తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సెకన్ల వ్యవధిలోనే రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేవలం 10 సెకన్లలోపే అంతా జరిగిపోయింది. ఈ ఘటనతో సహచర విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

ఫిబ్రవరి 8న ప్రిన్స్.. సందీప్ కౌర్కు ఫోన్ చేసి ప్రేమ ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో కోపం, పగతో రగిలిపోయిన ప్రిన్స్.. తన తండ్రికి సంబంధించిన లైసెన్స్ తుపాకీ తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

గతేడాది నుంచి సందీప్ కౌర్ను ప్రిన్స్ వెంబడిస్తున్నాడు. మొదటి నుంచి అతడి ప్రేమను తిరస్కరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సందీప్ కౌర్ కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. నిశ్చితార్థానికి సిద్ధపడుతున్నారు. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సందీప్ కౌర్ తండ్రి చనిపోయారు. ఆరుగురు సోదరీమణులు, ఒక సోదరుడితో నివాసం ఉంటుంది. న్యాయవాది వృత్తి ద్వారా తన తల్లికి అండగా ఉండాలని సందీప్ కౌర్ భావించింది. కానీ సహచర విద్యార్థి చేతిలోనే ప్రాణాలు కోల్పోతానని ఊహించలేకపోయింది.
ఇక తరగతి గదిలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బ్యాగ్ పరిశీలించకుండా ఎలా పంపించారని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!