Vade Bharat Express: వందేభారత్పై రాళ్ల దాడి.. పగిలిన విండో గ్లాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vade Bharat Express: భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్లపై వరుసగా రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చిస్తున్నప్పటికీ.. ఆకతాయిలు వాటిని బేఖాతరు చేస్తూ, దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆగ్రా రైల్వే డివిజన్లోనూ వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. బుధవారం భోపాల్ నుంచి ఢిల్లీ నిజాముద్దీన్కు బయలుదేరిన వందేభారత్పై కొందరు దుండగులు ఆగ్రా రైల్వే డివిజన్ వద్ద దాడి చేయడంతో.. విండో గ్లాసులు పగిలాయి.
Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్కు పాక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరోసారి సమన్లు
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా రైల్వే డివిజన్లోని మానియా, జజౌ స్టేషన్ల మధ్య ఈ వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో సి-7 కోచ్లోని సీటు నంబర్ 13-14 కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే.. ఈ దాడిలో ప్యాసింజర్లెవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఈ దాడి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ఈ ఘటనపై స్పందిస్తూ.. దీనిపై విచారణ ప్రారంభించామని, నిందితులెవరో పసిగట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ దాడిలో కేవలం కిటికీ అద్దాలు పగిలాయని, ఎవరికీ ఏ హాని జరగలేదని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి
కాగా.. వందేభారత్ రైలుపై ఈ తరహా దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. విశాఖపట్నంలోని కంచెరపాలెంలోనూ ఇలాగే రాళ్ల దాడి చేయగా.. రెండు కోచ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ట్రయల్ రన్లో ఉండగానే ఈ దాడి జరిగింది. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో వెళ్లే వందేభారత్ రైలుపై ఇప్పటివరకూ మూడుసార్లు దాడి జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే.. ఇప్పటివరకూ ఇలాంటి దాడులు 25 నుంచి 30 వరకు చోటు చేసుకున్నట్టు సమాచారం. దీంతో.. రైల్వే శాఖ ఈ తరహా దాడుల్ని కట్టడి చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?