NTV Telugu Site icon

Doctors Cheating: ఏం వైద్యులు రా.. బాబు..! గర్భాశయం తొలగిస్తామని కిడ్నీలే మాయం చేశారు..!

Doctors Cheating

Doctors Cheating

వైద్యం అంటే మామూలుగా వుండదు మరి. ఓ మహిళ తీవ్ర కడుపు నొప్పితో వైద్యుల దగ్గరకు వెళ్లింది. తనకు కడుపు నొప్పిగా వుందని చెప్పడంతో.. వైద్యులు స్కానింగ్‌ చేయాలన్నారు. దీంతో ఆమె స్కానింగ్‌ చేయించగా వైద్యులు షాక్‌ తిన్నారు. ఆమెకు ఆవిషయం గురించి చెప్పగా బాధితురాలు షాక్ నుంచి తేరుకోలేక పోయింది. ఇంతకీ ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన సునీతాదేవి కి 33 ఏళ్లు. అమె తీవ్రమైన కడుపునొప్పితో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లింది. భరించలేని కడుపునొప్పి రావడంతో.. అక్కడున్న వైద్యులు టెస్టులు చేసి, తన గర్భాశయం తొలగించాలని చెప్పారు.

అయితే.. సునీతాదేవి కుటుంబసభ్యులు ఆపరేషన్ రూ. 30 వేలకు జరిగేలా మాట్లాడుకున్నారు. దీంతో.. సెప్టెంబర్ 3వ తేదీన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇక ఆ మరుసటి రోజు నుంచే సునీతా దేవి ఆరోగ్య పరిస్థితి మరింతగా దిగజారింది. భరించలేక ఆమె కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 5వ తేదీన పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. సునీతాను డాక్టర్లు పరీక్షించి.. షాకింగ్ నిజాన్ని చెప్పారు. తన శరీరంలో రెండు కిడ్నీలు లేవని తెలిపారు. అవాక్కైన కుటుంబ సభ్యులు కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్తే, కిడ్నీలు తీసేయడమేంటని లబోదిబోమన్నారు. కాగా.. సదరు క్లినిక్ నిర్వాహకుడిపై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై మానవ అవయవాల మార్పిడి చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.
Cm Jagan: రూ.1000 కోట్ల రుణం కోసం ఏపీ సర్కార్ ప్రయత్నాలు