UPI: ఏప్రిల్ 1 నుంచి వీరికి ఫోన్పే, గూగుల్ పే పనిచేయదు.. నివారించాలంటే ఇలా చేయండి..
- ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్..
- కీలక ఆదేశాలు జారీ చేసిన NPCI..
- ఏప్రిల్ 1, 2025 నుంచి అమలుకు రంగం సిద్ధం..
- సాంకేతిక సమస్యలు, సైబర్ నేరాలను అడ్డుకోడమే లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్లు చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుండి తొలగించనున్నారు. ఈ నిర్ణయం ఫోన్పే, పేటీఎం, గూగుల్ వంటి యూపీఐ యాప్లపై ప్రభావం చూపుతుందని NPCI ప్రకటించింది.
ఇన్యాక్టివ్గా ఉన్న నంబర్ల వల్ల సాంకేతిక సమస్యలు, మోసాలకు కారణం అవుతున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నందున NPCI నిర్ణయం తీసుకుంది. ఇన్యాక్టివ్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలకు కారణమవుతున్నాయి. టెలికాం ప్రొవైడర్లు ఈ ఉపయోగించని నెంబర్లను వేరేవారికి కేటాయించినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఇది మోసపూరిత కార్యకలాపాలకు ఒక కారణం అవుతుంది.
Also Read
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
Read Also: RG Kar protests: “ఆర్జీ కర్” నిరసనల్లో పాల్గొన్న డాక్టర్పై మమతా సర్కార్ ప్రతీకారం..
ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, యూపీఐ లావాదేవీల కోసం యూజర్లు యాక్టివ్గా ఉండే నంబర్లను వారి బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం ముఖ్యం. యూజర్లు వారి మొబైల్ నెంబర్ యాక్టివిటీని వెరిఫై చేయాలి. యూపీఐ యూజర్లు తమ లింక్ చేయని మొబైల్ నంబర్ల స్టేటస్ని వారి టెలికాం ప్రొవైడర్లతో చెక్ చేసుకోవాలి. ఒక నంబర్ ఇన్యాక్టివ్గా ఉంటే లేదా ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే దానిని వెంటనే తిరిగి యాక్టివ్ చేయాలి లేదా కొత్త మొబైల్ నెంబర్తో వారి బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేయాలి. ఈ చర్యల వల్ల యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఉండు. దీంతో పాటు సైబర్ క్రైమ్ ప్రమాదాలను నివారించవచ్చు.
బ్యాంకులు, యూపీఐ యాప్లను రికార్డులను అప్డేట్ చేయాలని NPCI ఆదేశించింది. బ్యాంకులు, యూపీఐ యాప్లు వారానికి ఒకసారి వారి ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్ల రికార్డులను తనిఖీ చేయాలని కోరింది. యూపీఐ లావాదేవీలకు యాక్టివ్ మొబైల్ నంబర్లు మాత్రమే బ్యాంక్ ఖాతాలతో లింక్ చేయాలనేది దీని లక్ష్యం. ఇలా చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సైబర్ నేరాలు, సాంకేతిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించాలని NPCI లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్లో ‘ఫౌజీ’ పోస్ట్ప్రొడక్షన్ వర్క్!
-
Majji Srinivasa Rao: వైసీపీకి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు రాజీనామా
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!