UPI: ఏప్రిల్ 1 నుంచి వీరికి ఫోన్పే, గూగుల్ పే పనిచేయదు.. నివారించాలంటే ఇలా చేయండి..
- ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్..
- కీలక ఆదేశాలు జారీ చేసిన NPCI..
- ఏప్రిల్ 1, 2025 నుంచి అమలుకు రంగం సిద్ధం..
- సాంకేతిక సమస్యలు, సైబర్ నేరాలను అడ్డుకోడమే లక్ష్యం..
UPI: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్లు చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉంటే, వాటిని బ్యాంక్ ఖాతాల నుండి తొలగించనున్నారు. ఈ నిర్ణయం ఫోన్పే, పేటీఎం, గూగుల్ వంటి యూపీఐ యాప్లపై ప్రభావం చూపుతుందని NPCI ప్రకటించింది.
ఇన్యాక్టివ్గా ఉన్న నంబర్ల వల్ల సాంకేతిక సమస్యలు, మోసాలకు కారణం అవుతున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నందున NPCI నిర్ణయం తీసుకుంది. ఇన్యాక్టివ్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలకు కారణమవుతున్నాయి. టెలికాం ప్రొవైడర్లు ఈ ఉపయోగించని నెంబర్లను వేరేవారికి కేటాయించినప్పుడు సమస్య ఏర్పడుతుంది. ఇది మోసపూరిత కార్యకలాపాలకు ఒక కారణం అవుతుంది.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
Read Also: RG Kar protests: “ఆర్జీ కర్” నిరసనల్లో పాల్గొన్న డాక్టర్పై మమతా సర్కార్ ప్రతీకారం..
ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, యూపీఐ లావాదేవీల కోసం యూజర్లు యాక్టివ్గా ఉండే నంబర్లను వారి బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం ముఖ్యం. యూజర్లు వారి మొబైల్ నెంబర్ యాక్టివిటీని వెరిఫై చేయాలి. యూపీఐ యూజర్లు తమ లింక్ చేయని మొబైల్ నంబర్ల స్టేటస్ని వారి టెలికాం ప్రొవైడర్లతో చెక్ చేసుకోవాలి. ఒక నంబర్ ఇన్యాక్టివ్గా ఉంటే లేదా ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే దానిని వెంటనే తిరిగి యాక్టివ్ చేయాలి లేదా కొత్త మొబైల్ నెంబర్తో వారి బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేయాలి. ఈ చర్యల వల్ల యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఉండు. దీంతో పాటు సైబర్ క్రైమ్ ప్రమాదాలను నివారించవచ్చు.
బ్యాంకులు, యూపీఐ యాప్లను రికార్డులను అప్డేట్ చేయాలని NPCI ఆదేశించింది. బ్యాంకులు, యూపీఐ యాప్లు వారానికి ఒకసారి వారి ఇన్యాక్టివ్ మొబైల్ నంబర్ల రికార్డులను తనిఖీ చేయాలని కోరింది. యూపీఐ లావాదేవీలకు యాక్టివ్ మొబైల్ నంబర్లు మాత్రమే బ్యాంక్ ఖాతాలతో లింక్ చేయాలనేది దీని లక్ష్యం. ఇలా చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో సైబర్ నేరాలు, సాంకేతిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించాలని NPCI లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!