Kunal Kamra: కునాల్ కమ్రాకు షాక్.. ‘‘బుక్ మై షో’’ నుంచి పేరు తొలగింపు
- కమెడియన్ కునాల్ కమ్రాకు షాక్
- బుక్ మై షో పోర్టల్ నుంచి పేరు తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు షాక్ తగిలింది. బుక్ మై షోలో కళాకారుల జాబితా నుంచి కునాల్ కమ్రా పేరును తొలగించింది. ఆర్టిస్టుల జాబితా నుంచి కునాల్ పేరును తొలగించిందని శివసేన కార్యకర్త రాహుల్ కునాల్ శనివారం తెలిపారు. ఇప్పుడు పోర్టల్ పరిశుభ్రంగా ఉందని.. అటువంటి కళాకారుడిని వినోద జాబితా నుంచి దూరంగా ఉంచినందుకు బుక్మైషో సీఈవో ఆశిష్ హేమరాజనికి రాహుల్ కునాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుక్మైషో బృందాన్ని సంప్రదించినప్పుడు ప్రస్తుతానికి కునాల్కు సంబంధించిన వీడియోలు లేవని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా పోర్టల్లో ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వమని కూడా చెప్పినట్లుగా పేర్కొన్నారు. శాంతిని కాపాడటంలో.. అలాగే భావోద్వేగాలను గౌరవించడంలో బుక్ మై షో పోర్టల్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ముంబై ప్రజలు.. కళను ప్రేమిస్తారు కానీ.. వ్యక్తిగత అజెండాలను కాదని రాహుల్ కునాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
Also Read
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి కమెడియన్ కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే శివసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అనంతరం కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన క్లబ్పై శివసేన కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Dokka Manikya Varaprasad: దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన..
కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు పంపించారు. కానీ కునాల్ కమ్రా మాత్రం హాజరుకాలేదు. అంతేకాకుండా షిండేపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదన్నారు. న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతానని చెప్పారు. ఇంతలో మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా మద్దతు ఇచ్చారు. కునాల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: భర్తలారా..బహుపరాక్! ఇల్లాలు హత్య కేసులో జైలుకు భర్త.. తీరా చూస్తే..!
తాజావార్తలు
-
Crispy Jalebi Recipe: ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతం!
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
-
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
-
Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్స్టా పోస్ట్కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో