Kunal Kamra: కునాల్ కమ్రాకు షాక్.. ‘‘బుక్ మై షో’’ నుంచి పేరు తొలగింపు
- కమెడియన్ కునాల్ కమ్రాకు షాక్
- బుక్ మై షో పోర్టల్ నుంచి పేరు తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు షాక్ తగిలింది. బుక్ మై షోలో కళాకారుల జాబితా నుంచి కునాల్ కమ్రా పేరును తొలగించింది. ఆర్టిస్టుల జాబితా నుంచి కునాల్ పేరును తొలగించిందని శివసేన కార్యకర్త రాహుల్ కునాల్ శనివారం తెలిపారు. ఇప్పుడు పోర్టల్ పరిశుభ్రంగా ఉందని.. అటువంటి కళాకారుడిని వినోద జాబితా నుంచి దూరంగా ఉంచినందుకు బుక్మైషో సీఈవో ఆశిష్ హేమరాజనికి రాహుల్ కునాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుక్మైషో బృందాన్ని సంప్రదించినప్పుడు ప్రస్తుతానికి కునాల్కు సంబంధించిన వీడియోలు లేవని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా పోర్టల్లో ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వమని కూడా చెప్పినట్లుగా పేర్కొన్నారు. శాంతిని కాపాడటంలో.. అలాగే భావోద్వేగాలను గౌరవించడంలో బుక్ మై షో పోర్టల్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ముంబై ప్రజలు.. కళను ప్రేమిస్తారు కానీ.. వ్యక్తిగత అజెండాలను కాదని రాహుల్ కునాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి కమెడియన్ కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే శివసేన కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అనంతరం కునాల్ కమ్రా కార్యక్రమం నిర్వహించిన క్లబ్పై శివసేన కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. అంతేకాకుండా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Dokka Manikya Varaprasad: దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన..
కునాల్ కమ్రాకు ముంబై పోలీసులు రెండు సార్లు సమన్లు పంపించారు. కానీ కునాల్ కమ్రా మాత్రం హాజరుకాలేదు. అంతేకాకుండా షిండేపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదన్నారు. న్యాయస్థానాలు అడిగితే మాత్రం క్షమాపణ చెబుతానని చెప్పారు. ఇంతలో మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా మద్దతు ఇచ్చారు. కునాల్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: భర్తలారా..బహుపరాక్! ఇల్లాలు హత్య కేసులో జైలుకు భర్త.. తీరా చూస్తే..!
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?