Karnataka: భర్తలారా..బహుపరాక్! ఇల్లాలు హత్య కేసులో జైలుకు భర్త.. తీరా చూస్తే..!
- భర్తలారా..బహుపరాక్!
- ఇల్లాలు హత్య కేసులో భర్తకు రెండేళ్లు జైలు
- అన్యాయంగా జైలుకు పంపించిన పోలీసులు
- తాజా ఘటనతో షాకైన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ప్రియుడి మోజులో పడి భార్యలు… నిర్దాక్షిణ్యంగా కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువగా వారల్లో చూస్తున్నాం.. వింటున్నాం. కానీ ఈ ఇల్లాలు మాత్రం భిన్నంగా ప్లాన్ చేసింది. చాలా పక్కా ప్రణాళికతో స్కెచ్ గీసింది. అనుకున్నట్టుగానే భర్త కటకటాల పాలయ్యాడు. ఆమె మాత్రం ప్రియుడితో కులాసాగా తిరుగుతోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. భర్త ఎలా జైలుకెళ్లాడు.. ఆమె.. ప్రియుడితో ఎలా జల్సా చేస్తుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
సురేష్, మల్లిగే భార్యాభర్తలు. కర్ణాటకలోని కొడగు జిల్లా కుశాల్నగర్ తాలూకాలోని బసవనహళ్లి గ్రామంలో నివాసం ఉంటారు. 2019లో అకస్మాత్తుగా మల్లిగే అదృశ్యమైంది. దీంతో అతడు.. ఆమె జాడ కోసం కుటుంబ సభ్యులను, తెలిసిన వారందరి దగ్గర వాకబు చేశాడు. ఆమె ప్రియుడితో వెళ్లిపోయినట్లుగా గుర్తించాడు. అయితే ఒకసారి ఆమె ఫోన్ కలవడంతో.. దయచేసి పిల్లల కోసమైనా టచ్లో ఉండాలని సురేష్ బతిమాలాడు. అందుకు ఆమె ససేమిరా అంది.
Also Read
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
అయితే తనను ఏ కేసులోనైనా ఇరికిస్తారన్న భయంతో సురేష్.. 2021లో కుశాల్ నగర్ పోలీసులకు భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఇదే అతడికి శాపమైంది. 2022లో పెరియపట్నం తాలూకాలోని బెట్టడపుర సమీపంలో మహిళ అస్థిపంజరం ఉందంటూ సురేష్ను, అతడి అత్తగారిని పోలీసులు పిలిపించారు. అక్కడున్న చీర, వస్తువులను బట్టి.. మృతదేహం తన భార్యదేనని చెప్పాడు. అనంతరం అస్థిపంజరాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. భార్యను చంపేశావంటూ సురేష్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తాను చంపలేందంటూ ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.
సంవత్సరాల పాటు సురేష్ జైల్లో మగ్గిపోయాడు. అనంతరం అస్థిపంజరానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. అందులో డీఎన్ఏ పరీక్షల్లో మల్లిగే కుటుంబానికి సంబంధించిన జన్యుపరంగా ఎలాంటి పోలిక సరిపోలేదు. దీంతో అస్థిపంజరం ఆమెది కాదని తేల్చారు. దీంతో సురేష్ను నిర్దోషిగా తేల్చి జైలు నుంచి విడుదల చేశారు.
అయితే తాజాగా ఏప్రిల్ 1, 2025న మల్లిగే తన ప్రియుడితో సజీవంగా ప్రత్యక్షమైంది. మడికేరిలోని ఒక హోటల్లోకి ప్రియుడి చేతిలో చేయి వేసి నడుచుకుంటూ రావడాన్ని సురేష్ స్నేహితులు గమనించారు. ఇద్దరూ కలిసి కూర్చుని తినడాన్ని కనిపెట్టారు. అంతేకాకుండా ఫొటోలు తీశారు. ఫొటోలను సురేష్కు చూపించగా షాక్ అయ్యాడు. భార్య మల్లిగే అని కనిపెట్టాడు. అనంతరం ఆ ఫొటోలను పోలీస్ అధికారులకు చూపించగా వాళ్లు కూడా షాక్కు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మల్లిగేను అదుపులోకి తీసుకుని మైసూర్ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!