Monsoon: వాన కబురు.. 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- అన్నదాతలకు వాన కబురు
- 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రారంభం అవుతాయని.. షెడ్యూల్ ప్రకారం సకాలంలో వస్తాయని సూచించింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అంతేకాకుండా జలాశయాలు కూడా నిండుకుంటాయని వెల్లడించింది. ఇవన్నీ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: US: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు చేర్చుకోవద్దని హుకుం
Also Read
గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్లు పేర్కొంది. 2-3 రోజుల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ అంచనా వేసింది. ఇక భారతదేశానికి రుతుపవనాలు సకాలంలో రావడం చాలా కీలకమైన అంశం. వ్యవసాయ రంగం ఊపందుకుంటే ఆర్థిక రంగం మెరుగుపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం!
2025 సంవత్సరానికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఖరీఫ్ సీజన్ బలంగా ఉంటుందని, గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆశలు రేకెత్తిస్తోంది. ముందస్తు వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ మరియు నూనెగింజల విత్తడానికి తోడ్పడతాయని మరియు రబీ సీజన్కు ముందు జలాశయ స్థాయిలను పెంచుతాయని భావిస్తున్నారు.
కేరళతో పాటు దక్షిణ మరియు మధ్య అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కొమోరిన్ ప్రాంతం. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇక దక్షిణ కొంకణ్-గోవా తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన వ్యవస్థ ఏర్పడినట్లు అంచనా వేసింది. రాబోయే 36 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో పేర్కొంది. పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
-
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
-
Trump Hair: హెయిర్స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!