Monsoon: వాన కబురు.. 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- అన్నదాతలకు వాన కబురు
- 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రారంభం అవుతాయని.. షెడ్యూల్ ప్రకారం సకాలంలో వస్తాయని సూచించింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అంతేకాకుండా జలాశయాలు కూడా నిండుకుంటాయని వెల్లడించింది. ఇవన్నీ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: US: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు చేర్చుకోవద్దని హుకుం
Also Read
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే వచ్చేస్తున్నాయి. అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్లు పేర్కొంది. 2-3 రోజుల్లో మాత్రం నైరుతి రుతుపవనాలు తాకడం ఖాయమని ఐఎండీ అంచనా వేసింది. ఇక భారతదేశానికి రుతుపవనాలు సకాలంలో రావడం చాలా కీలకమైన అంశం. వ్యవసాయ రంగం ఊపందుకుంటే ఆర్థిక రంగం మెరుగుపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం!
2025 సంవత్సరానికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఖరీఫ్ సీజన్ బలంగా ఉంటుందని, గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆశలు రేకెత్తిస్తోంది. ముందస్తు వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ మరియు నూనెగింజల విత్తడానికి తోడ్పడతాయని మరియు రబీ సీజన్కు ముందు జలాశయ స్థాయిలను పెంచుతాయని భావిస్తున్నారు.
కేరళతో పాటు దక్షిణ మరియు మధ్య అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కొమోరిన్ ప్రాంతం. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, దక్షిణ మరియు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇక దక్షిణ కొంకణ్-గోవా తీరంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన వ్యవస్థ ఏర్పడినట్లు అంచనా వేసింది. రాబోయే 36 గంటల్లో ఉత్తరం వైపు కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో పేర్కొంది. పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!