Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
- అన్నదాతలకు శుభవార్త
- 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
- వారం.. 10 రోజుల్లో దేశమంతటా విస్తరణ
- ఊపందుకోనున్న ఖరీఫ్ సీజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు మరికొన్ని గంటల్లో కేరళను తాకబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే 24 గంటల్లో తొలకరి వర్షం కేరళ తీరాన్ని తాకబోతున్నాయని ఐఎండీ తెలిపింది. గురువారం కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ‘‘తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు.. లక్షద్వీప్ దీవులకు.. నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు.. ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.’’ అని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాలు కేరళ గుండా ప్రయాణం చేస్తూ మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీకి చేరుకుంటాయని తెలిపింది. అనంతరం దేశ మంతటా విస్తరించనున్నాయి. ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది. దీంతో రుతుపవనాలు ఎప్పుడొస్తాయని కర్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. నారుమళ్లు వేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు కురిస్తే పంటలు వేగం పుంజుకుంటాయి. అందరికీ పనులు దొరుకుతాయి. కూలీలకు చేతి నిండా డబ్బులు ఉంటాయి.
Also Read
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
ఇక వారం రోజుల్లో రుతుపవనాలు ముంబైకి చేరుకోనున్నాయి. ప్రస్తుతం కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో ముఖ్యంగా కొంకణ్, గోవా ప్రాంతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది.
ఈసారి ఆలస్యం..
వాస్తవానికి ఈపాటికే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాలి. కానీ ఈ ఏడాది ఆలస్యమయ్యాయి. గతేడాది మే నెల మధ్యలోనే రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు, నదులు నిండుకున్నాయి. పాడి పంటలు సమృద్ధిగా పండాయి. మొత్తానికి ఆలస్యమైనా గురువారం కేరళను రుతుపవనాలు తాకనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ముంచుకొస్తున్న ఎల్నినో
ఇదిలా ఉంటే మరోవైపు ఎల్నినో ముంచుకొస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో వర్షాలు తక్కువై ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం భారత్పై కూడా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు తక్కువై ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

తాజావార్తలు
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!