Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
- అన్నదాతలకు శుభవార్త
- 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
- వారం.. 10 రోజుల్లో దేశమంతటా విస్తరణ
- ఊపందుకోనున్న ఖరీఫ్ సీజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నదాతలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు మరికొన్ని గంటల్లో కేరళను తాకబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాబోయే 24 గంటల్లో తొలకరి వర్షం కేరళ తీరాన్ని తాకబోతున్నాయని ఐఎండీ తెలిపింది. గురువారం కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ‘‘తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు.. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు.. లక్షద్వీప్ దీవులకు.. నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు.. ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.’’ అని భారత వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాలు కేరళ గుండా ప్రయాణం చేస్తూ మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీకి చేరుకుంటాయని తెలిపింది. అనంతరం దేశ మంతటా విస్తరించనున్నాయి. ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది. దీంతో రుతుపవనాలు ఎప్పుడొస్తాయని కర్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. నారుమళ్లు వేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వర్షాలు కురిస్తే పంటలు వేగం పుంజుకుంటాయి. అందరికీ పనులు దొరుకుతాయి. కూలీలకు చేతి నిండా డబ్బులు ఉంటాయి.
Also Read
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
- Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
ఇక వారం రోజుల్లో రుతుపవనాలు ముంబైకి చేరుకోనున్నాయి. ప్రస్తుతం కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో ముఖ్యంగా కొంకణ్, గోవా ప్రాంతంలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది.
ఈసారి ఆలస్యం..
వాస్తవానికి ఈపాటికే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాలి. కానీ ఈ ఏడాది ఆలస్యమయ్యాయి. గతేడాది మే నెల మధ్యలోనే రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు, నదులు నిండుకున్నాయి. పాడి పంటలు సమృద్ధిగా పండాయి. మొత్తానికి ఆలస్యమైనా గురువారం కేరళను రుతుపవనాలు తాకనుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
ముంచుకొస్తున్న ఎల్నినో
ఇదిలా ఉంటే మరోవైపు ఎల్నినో ముంచుకొస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో వర్షాలు తక్కువై ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం భారత్పై కూడా ఎక్కువగా ఉంటుంది. వర్షాలు తక్కువై ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!