Odisha: ఒడిశాలో బోటు బోల్తా.. సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు
- ఒడిశాలో బోటు బోల్తా
- సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోదరుడు కుటుంబం ఒడిశాలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత పూరీ బీచ్లో స్పీడ్ బోటులో విహరిస్తుండగా ఒకసారిగా బోల్తా పడింది. బోటులో ఎవరూ లేకపోవడంతో తేలికగా ఉండడంతో బోల్తా పడి పోయింది. దీంతో దంపతులిద్దరూ భయాందోళనకు గురయ్యారు. రక్షించాలంటూ గంగూలీ వదిన అర్పిత కేకలు వేసింది. వెంటనే రంగంలోకి దిగిన లైఫ్గార్డులు.. పర్యాటకులందరినీ రక్షించారు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉండడంతోనే స్పీడ్బోటు బోల్తా పడిందని తెలిపారు. ప్రాణభయంతో అర్పిత కన్నీళ్లు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
వేసవి సెలవుల్లో భాగంగా గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత ఆదివారం ఒడిశాకు వచ్చారు. అనంతరం పూరీ సమీపంలో సముద్రంలో స్పీడ్ బోటు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే సముద్రంలో ఆటుపోటులు ఎక్కువ్వడంతో ఒక్కసారిగా బోటు బోల్తా పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. క్షేమంగా పర్యాటకులందరినీ బయటకు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
బోటులో పర్యాటకులు లేకపోవడంతోనే బోల్తా పడిందని అర్పిత ఆరోపించారు. పడవలో 10 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటే.. డబ్బుకు కక్కుర్తి పడి ముగ్గురు, నలుగురు వ్యక్తులనే ఎక్కించుకున్నారని.. దీంతో తేలికగా ఉండడంతో తల్లకిందులుగా పడిపోయిందని వాపోయింది. సముద్రంలోకి వెళ్లేందుకు ఆందోళన వ్యక్తం చేశామని.. కానీ ఆపరేటర్లు పర్వాలేదని చెప్పడంతోనే లోపలికి వెళ్లినట్లు అర్పిత తెలిపారు. సముద్రంలోకి వెళ్లగానే ఒక పెద్ద అల బోటును ఢీకొట్టిందని.. దీంతో బోల్తా పడిపోయిందని చెప్పారు. సమయానికి లైఫ్గార్డులు రాకపోతే.. ప్రాణాలు పోయేవని.. తాము ఇంకా భయాందోళనలోనే ఉన్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కోల్కతాకు వెళ్లాక.. పూరీ బీచ్లో స్పోర్ట్స్ క్రీడలను నిలిపివేయాలని పోలీస్ సూపరింటెండెంట్కు, ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఇకపై పూరీలో స్పోర్ట్స్ క్రీడలు వద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బోటు ఆపరేటర్లు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. ఇప్పటికే రుతుపవనాల రాకతో చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక బోటు బోల్తా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..