Odisha: ఒడిశాలో బోటు బోల్తా.. సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు
- ఒడిశాలో బోటు బోల్తా
- సౌరవ్ గంగూలీ సోదరుడి కుటుంబానికి తప్పిన ముప్పు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోదరుడు కుటుంబం ఒడిశాలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత పూరీ బీచ్లో స్పీడ్ బోటులో విహరిస్తుండగా ఒకసారిగా బోల్తా పడింది. బోటులో ఎవరూ లేకపోవడంతో తేలికగా ఉండడంతో బోల్తా పడి పోయింది. దీంతో దంపతులిద్దరూ భయాందోళనకు గురయ్యారు. రక్షించాలంటూ గంగూలీ వదిన అర్పిత కేకలు వేసింది. వెంటనే రంగంలోకి దిగిన లైఫ్గార్డులు.. పర్యాటకులందరినీ రక్షించారు. సముద్రంలో అల్లకల్లోలంగా ఉండడంతోనే స్పీడ్బోటు బోల్తా పడిందని తెలిపారు. ప్రాణభయంతో అర్పిత కన్నీళ్లు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Peace Committee: మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకి అప్పగించండి
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
వేసవి సెలవుల్లో భాగంగా గంగూలీ సోదరుడు స్నేహాశిష్, అతని భార్య అర్పిత ఆదివారం ఒడిశాకు వచ్చారు. అనంతరం పూరీ సమీపంలో సముద్రంలో స్పీడ్ బోటు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే సముద్రంలో ఆటుపోటులు ఎక్కువ్వడంతో ఒక్కసారిగా బోటు బోల్తా పడి పోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. క్షేమంగా పర్యాటకులందరినీ బయటకు తీసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!
బోటులో పర్యాటకులు లేకపోవడంతోనే బోల్తా పడిందని అర్పిత ఆరోపించారు. పడవలో 10 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటే.. డబ్బుకు కక్కుర్తి పడి ముగ్గురు, నలుగురు వ్యక్తులనే ఎక్కించుకున్నారని.. దీంతో తేలికగా ఉండడంతో తల్లకిందులుగా పడిపోయిందని వాపోయింది. సముద్రంలోకి వెళ్లేందుకు ఆందోళన వ్యక్తం చేశామని.. కానీ ఆపరేటర్లు పర్వాలేదని చెప్పడంతోనే లోపలికి వెళ్లినట్లు అర్పిత తెలిపారు. సముద్రంలోకి వెళ్లగానే ఒక పెద్ద అల బోటును ఢీకొట్టిందని.. దీంతో బోల్తా పడిపోయిందని చెప్పారు. సమయానికి లైఫ్గార్డులు రాకపోతే.. ప్రాణాలు పోయేవని.. తాము ఇంకా భయాందోళనలోనే ఉన్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కోల్కతాకు వెళ్లాక.. పూరీ బీచ్లో స్పోర్ట్స్ క్రీడలను నిలిపివేయాలని పోలీస్ సూపరింటెండెంట్కు, ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఇకపై పూరీలో స్పోర్ట్స్ క్రీడలు వద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బోటు ఆపరేటర్లు ఎలా అనుమతించారో అర్థం కావడం లేదు. ఇప్పటికే రుతుపవనాల రాకతో చాలా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక బోటు బోల్తా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Viral Video: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
-
Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!