అధినేత్రి నుంచి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కాలంలో చురుగ్గా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతలకు స్పష్టం చేశారు. గత కొంతకాలంగా హస్తిన వేదికగా రాజకీయాలు మారడంతో.. కాంగ్రెస్ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ జనరల్ సెక్రటరీ, ఏఐసీసీ ఇంఛార్జులతో పార్టీ అధ్యక్షురాలు సొనియాగాంధీ వర్చువల్గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. దేశంలో వ్యాక్సినేషన్ స్పీడందుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. టీకాపై జనాల్లో ఉన్న భయాన్ని తొలగించాలని.. వేస్టేజీని తగ్గించాలని అన్నారు. అంతేకాదు.. ఈ ఏడాది చివరి నాటికి 75 శాతం మంది ప్రజలకు టీకాలు అందించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. అప్పుడే కరోనా ముప్పును అధిగమించగలమన్నారు సోనియా గాంధీ.
మూడో వేవ్ ముంచుకొస్తుందన్న హెచ్చరికలపైనా ఆమె స్పందించారు. మూడోవేవ్కు దేశం సిద్ధంగా ఉండాలని చెప్పారు. సెకండ్ వేవ్ విలయం నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. మూడో వేవ్ ముప్పు నుంచి చిన్నారులను మినహాయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం చేయాలని నాయకులకు సోనియా గాంధీ సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రైతులు, మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోందని చెప్పారు. దీనిపై నిరంతరం ఆందోళనలు చేపట్టాలని అన్నారు. దీంతో పాటు నిత్యవసర ధరలు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు సోనియా గాంధీ. ఇక కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేయాలని నాయకులకు చెప్పారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!