Sonam Wangchuk: జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా.. సోనమ్ వాంగ్చుక్ హెచ్చరిక
- జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా
- సోనమ్ వాంగ్చుక్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లడఖ్ రాష్ట్ర సాధన కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ప్రస్తుతం రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో ఉంచారు. లడఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున లడఖ్లో హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలను అల్లరిమూకలు తగలబెట్టారు. సోనమ్ వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే ఈ హింస చెలరేగినట్లుగా కేంద్రం భావించింది. దీంతో సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్టు చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ జైలుకు తరలించారు. అయితే జైలు నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తానని సోనమ్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్-మెలానియా మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
Also Read
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
ఇక వాంగ్చుక్ అరెస్ట్ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఈ అరెస్ట్ ‘‘దురదృష్టకరం’’ అని అభివర్ణించారు. తాను హింసను సమర్థించడం లేదని.. కానీ అలాంటి పరిస్థితి రావడానికి ఎందుకు అనుమతించారో బీజేపీ సమాధానం చెప్పాలని కోరారు. బీజేపీ వారి వాగ్దానాలను ఎప్పటికీ నెరవేర్చదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లను ప్రారంభించిన మోడీ
ఇక వాంగ్చుక్ను లడఖ్లో కాకుండా జోధ్పూర్ జైలుకు తరలించడానికి అల్లర్లు మరింత పెరగకుండా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జైలు అత్యంత భద్రత కలిగిన జైలు. ఈ జైలు ప్రసిద్ధి చెందిన జైలు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన జైలు. ప్రస్తుతం వాంగ్చుక్ను ఏకాంత గదిలో ఉంచారు. నిరంతరం సీసీకెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
ఈ జైల్లో 1998లో కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్, అత్యాచార నిందితుడు ఆశారాం బాపూ వంటి ప్రముఖులు ఈ జైల్లోనే ఉన్నారు. ఇండియన్ ముజాహిదీన్, జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు అబ్దుల్ ఘనీ లోన్లకు చెందిన చాలా మంది ఉగ్రవాదులను కూడా ఈ జైల్లోనే ఉంచారు. 1965లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఈ జైలుపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో జైలులోని 30 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఈ జైల్లో 1,400 మంది ఖైదీలు ఉన్నారు. అయితే వాంగ్చుక్ను ఈ జైల్లో ఎందుకు ఉంచారో కారణం చెప్పకపోయినా.. ఆయన మద్దతుదారులు భారీ నిరసనలు చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమే శుక్రవారం వాంగ్చుక్ను అరెస్ట్ చేయగానే ప్రత్యేక హెలికాప్టర్లో రాజస్థాన్కు తరలించారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!