Sonam Wangchuk: జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా.. సోనమ్ వాంగ్చుక్ హెచ్చరిక
- జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తా
- సోనమ్ వాంగ్చుక్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లడఖ్ రాష్ట్ర సాధన కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ప్రస్తుతం రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో ఉంచారు. లడఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున లడఖ్లో హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలను అల్లరిమూకలు తగలబెట్టారు. సోనమ్ వాంగ్చుక్ రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే ఈ హింస చెలరేగినట్లుగా కేంద్రం భావించింది. దీంతో సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్టు చేసి రాజస్థాన్లోని జోధ్పూర్ జైలుకు తరలించారు. అయితే జైలు నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తానని సోనమ్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్-మెలానియా మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
Also Read
- NALSAR Row: నల్సార్ వివాదం.. లా స్టూడెంట్స్కు BCI చీఫ్ మనన్ మిశ్రా క్షమాపణ..
- CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Vishal Garg: ఒక్క వీడియో కాల్తో 900 మంది ఉద్యోగాలు ఊడగొట్టాడు.. ఇప్పుడు తన CEO పదవే ఊడింది!
- Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
ఇక వాంగ్చుక్ అరెస్ట్ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఈ అరెస్ట్ ‘‘దురదృష్టకరం’’ అని అభివర్ణించారు. తాను హింసను సమర్థించడం లేదని.. కానీ అలాంటి పరిస్థితి రావడానికి ఎందుకు అనుమతించారో బీజేపీ సమాధానం చెప్పాలని కోరారు. బీజేపీ వారి వాగ్దానాలను ఎప్పటికీ నెరవేర్చదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లను ప్రారంభించిన మోడీ
ఇక వాంగ్చుక్ను లడఖ్లో కాకుండా జోధ్పూర్ జైలుకు తరలించడానికి అల్లర్లు మరింత పెరగకుండా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జైలు అత్యంత భద్రత కలిగిన జైలు. ఈ జైలు ప్రసిద్ధి చెందిన జైలు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన జైలు. ప్రస్తుతం వాంగ్చుక్ను ఏకాంత గదిలో ఉంచారు. నిరంతరం సీసీకెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
ఈ జైల్లో 1998లో కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్, అత్యాచార నిందితుడు ఆశారాం బాపూ వంటి ప్రముఖులు ఈ జైల్లోనే ఉన్నారు. ఇండియన్ ముజాహిదీన్, జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు అబ్దుల్ ఘనీ లోన్లకు చెందిన చాలా మంది ఉగ్రవాదులను కూడా ఈ జైల్లోనే ఉంచారు. 1965లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో ఈ జైలుపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో జైలులోని 30 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఈ జైల్లో 1,400 మంది ఖైదీలు ఉన్నారు. అయితే వాంగ్చుక్ను ఈ జైల్లో ఎందుకు ఉంచారో కారణం చెప్పకపోయినా.. ఆయన మద్దతుదారులు భారీ నిరసనలు చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమే శుక్రవారం వాంగ్చుక్ను అరెస్ట్ చేయగానే ప్రత్యేక హెలికాప్టర్లో రాజస్థాన్కు తరలించారు.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!