Modi at Somnath : సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. చారిత్రక వేడుకలు.. ఆకాశాన్ని అలరించిన 3,000 డ్రోన్లు..!
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్.. చారిత్రక వేడుకలు
- సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- ఆకాశాన్ని అలరించిన 3,000 డ్రోన్లు
- 'అఖండ భారత్' సందేశం ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెడుతున్న యుగపురుషుడు, ప్రధాని నరేంద్ర మోడీ. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా, ఆధునిక సాంకేతికతను జోడించి మన ప్రాచీన పుణ్యక్షేత్రాలకు నూతన శోభను చేకూరుస్తున్న అపర భగీరథుడు ఆయన. అచంచలమైన దైవభక్తితో, దేశభక్తిని మేళవించి ప్రతి భారతీయుడిలో స్వాభిమానాన్ని నింపుతున్న మోడీ పర్యటనతో సోమనాథ్ తీరం నేడు భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

Also Read
భారతదేశ ఆధ్యాత్మిక , నాగరికతకు చిహ్నమైన గుజరాత్లోని సోమనాథ్ పుణ్యక్షేత్రం ఒక అపూర్వమైన ఘట్టానికి వేదికైంది. ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ (Somnath Swabhiman Parv) వేడుకల్లో భాగంగా నిర్వహించిన మెగా డ్రోన్ షోను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తిలకించారు. 1026వ సంవత్సరంలో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొట్టమొదటి దాడికి వెయ్యి ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఆ ఆలయం స్థితిస్థాపకతను , భారతీయ ధైర్యసాహసాలను చాటిచెప్పేందుకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకోగా, స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Potatoes: బంగాళాదుంపతో ప్రయోజనాలు..! నాలుగు ప్రధాన అపోహలు..
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సోమనాథుడిని దర్శించుకుని, లోకకల్యాణం కాంక్షిస్తూ ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా జలాభిషేకం నిర్వహించారు. పరమశివుడి పాదపద్మాల చెంత అచంచలమైన భక్తితో కొద్దిసేపు ధ్యానంలో మునిగిపోయిన ఆయన, భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి తన అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు.

ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన డ్రోన్ షో ఆద్యంతం అబ్బురపరిచింది. సుమారు 3,000 డ్రోన్లను ఉపయోగించి ఆకాశంలో అద్భుతమైన ఆకృతులను ఆవిష్కరించారు, ఇది దేశంలోని ఒక ఆలయ ప్రాంగణం సమీపంలో జరిగిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో 370 మీటర్ల వెడల్పు కలిగిన సోమనాథ్ ఆలయ 3D ప్రతిరూపాన్ని గాలిలో నిర్మించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. అలాగే, ఆకాశంలో సుమారు 280 మీటర్ల ఎత్తులో పరమశివుడి ఆకారాన్ని, 330 మీటర్ల పొడవుతో భారీ శివలింగాన్ని డ్రోన్ల సాయంతో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆధ్యాత్మికతతో పాటు జాతీయ సమగ్రతను చాటిచెబుతూ ‘అఖండ సోమనాథ్, అఖండ భారత్’ అనే సందేశాన్ని ఆకాశంలో ఆవిష్కరించారు.

ఐఐటీ ఢిల్లీకి చెందిన ‘బోట్ల్యాబ్’ (BotLab) సంస్థ ఈ ప్రదర్శనను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది. శివ తాండవం, డమరుకం, ఓం , త్రిశూలం వంటి శైవ చిహ్నాలను డ్రోన్లు ఆకాశంలో ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. సోమనాథ్ మన నాగరిక ధైర్యానికి ప్రతీక అని, ఈ వెయ్యేళ్ల చారిత్రక సందర్భంలో దేశమంతా ఏకమై పండుగలా జరుపుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఆలయ మార్గమంతా పండుగ శోభతో నిండిపోయిందని, పరాక్రమవంతుడైన వీర్ హమీర్జీ గోహిల్ త్యాగాలను స్మరించుకుంటూ ఈ వేడుకలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.

కేవలం రూ.21,599కే 55 అంగుళాల BESTON QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ..!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!