Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
- బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది..
- షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
- ట్రంప్ గెలుపుతో మారుతున్న సమీకరణాలు..
- యూనస్పై ఐసీసీలో ఫిర్యాదు..
- ట్రంప్ వ్యతిరేకిగా బంగ్లా ప్రభుత్వాధినేత యూనస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో ఏదో జరుగుతోంది.. రానున్న కొన్ని రోజుల్లో బంగ్లా రాజకీయాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత షేక్ హసీనా తనను తాను ప్రధానిగా సంభోదిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు ట్రంప్ గెలవడం ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్కి పెద్ద తన నొప్పిగా మారింది. మొదటి నుంచి ట్రంప్ వ్యతిరేకిగా యూనస్కి పేరుంది. ట్రంప్ గెలిచిన తర్వాత అతను కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. మరోవైపు షేక్ హసీనాకు, ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయి.
నిజానికి బంగ్లాదేశ్లో షేక్ హసీనాని గద్దె దించడానికి జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం, అమెరికా డీప్ స్టేట్ పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డీప్ స్టేట్ ట్రంప్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. మహ్మద్ యూనస్ బైడెన్, కమలా హారిస్కి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నాడు. ఇతడిని బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేతగా చేసిందే జోబైడెన్ అనే వాదన ఉంది. ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే రానున్న కాలంలో బంగ్లాదేశ్ రాజకీయాలు చాలా మార్పులకు గురవుతాయనేది స్పష్టంగా తెలుస్తోంది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Delhi: హిందూ ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోం.. సిక్కుల భారీ నిరసన(వీడియో)
షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కి వెళ్లేందుకు రంగం సిద్ధమైనట్లు వినికిడి. దీనికి తోడు మహ్మద్ యూనస్పై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం(ఐసీసీ)లో ఫిర్యాదు నమోదైంది. ఈ వారం బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్కి రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు పోరాడుతున్నారు. ఈ పరిణామాలు చూస్తే త్వరలోనే బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం పడిపోతుందనే భావన కలుగుతోంది.
యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులపై దాడులు జరిగాయి. ఈ దాడులను ఇటీవల ట్రంప్ తీవ్రంగా ఖండించారు. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి తాత్కిలిక ప్రభుత్వంలోని ముఖ్యులు భారత్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా, ఓ విధంగా చెప్పాలంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని భారత్ గమనిస్తోంది. బంగ్లాలోని తీవ్రవాద గ్రూపులు షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ట్రంప్ రావడంతో భారత్ ఇక బంగ్లాలో తన గేమ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!