Indo-Pak border: సరిహద్దులో పాక్ కవ్వింపులు.. జవాన్ వీరమరణం
- సరిహద్దులో పాక్ కవ్వింపులు
- జవాన్ వీరమరణం
- ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందని ఆర్మీ ప్రకటన
జమ్మూకాశ్మీర్లోని ఉరిలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ దళాలు చొరబాటుకు ప్రయత్నించాయి. దీంతో భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పుల్లో భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Bengaluru: స్నేహితుడి భార్యతో ఎఫైర్.. చివరికిలా…!
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
ఆగస్టు 12న చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇది సాధారణ చొరబాటు ప్రయత్నానికి భిన్నంగా ఉందని పేర్కొన్నాయి. చొరబాటుదారులకు పాకిస్థాన్ సైన్యం నుంచి మద్దతు లభించిందని.. వారి నుంచి కాల్పుల మద్దతు కూడా లభించిందని వెల్లడించాయి. పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్స్ మద్దతుతోనే ఈ చొరబాటు జరిగిందని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Kim Kardashian: భర్త గురక శబ్దం భరించలేక.. విడాకులు ఇచ్చిన స్టార్ సెలబ్రిటీ!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత బోర్డర్లో ఇంత స్థాయిలో అలజడి సృష్టించడం ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సింధు జలాల జోలికొస్తే అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమది అణ్వాయుధ దేశం అని.. తాము నాశనం అవుతున్నామంటే.. అవసరమైతే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. గతంలో ఇలా రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. ఇప్పుడు మరోసారి బోర్డర్లో అలజడి మొదలైంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!