Army Chief: సరిహద్దులో చైనా బలగాలు పెరిగాయి.. అన్నింటికి సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను ఉద్దేశిస్తూ.. ఉత్తర సరిహద్దు వద్ద ఎల్ఏసీని మార్చేందుకు ప్రయత్నించిన అన్ని చర్యలను భారత ఆర్మీ తిప్పికొట్టిందని అన్నారు.
Read Also: KL Rahul – Athiya: కేఎల్ రాహుల్, అథియా పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఈ నెల్లోనే!
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ బాగానే ఉందని.. ఉగ్రవాద కార్యకలాపాలు, మౌళిక సదుపాలకు పాకిస్తాన్ మద్దతు ఇప్పటికీ కొసాగుతుందని.. అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ..‘‘ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) గత ఐదేళ్లులో ఉత్తర సరిహద్దు వెంబడి 2,100 కిలోమీటప్ల రోడ్డు, 7450 మీటర్ల వంతెనలను నిర్మించిదని వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు వద్ద కొన్ని పనులు జరుగుతున్నాయని అన్నారు.
తూర్పు లడఖ్ సెక్టార్ లో 500 ట్యాంకులు, 400 తుపాకులను మోహరించామని వెల్లడించారు. 55,000 సైన్య ఉండేలా మౌళిక సదుపాయలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాల్లో శాంతి నెలకొందని ఆయన అన్నారు. జనవరి 15న ప్రతీఏడాది జరుపుకునే ఆర్మీ డే ప్రత్యేకమైందని అన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినందుకు ఈ సారి ఆర్మీడే చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఆర్టిలరీలో త్వరలో మహిళా అధికారులను నియమించవచ్చని జనరల్ పాండే చెప్పారు, ఆ మేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!