Siddaramaiah: ‘‘మీకు అడగటానికి వేరే ప్రశ్నలే లేవా.?’’ మీడియాపై సీఎం ఆగ్రహం..
- ‘‘మీరు అడగటానికి వేరే ప్రశ్నలే లేవా..?’’
- సీఎం మార్పుపై ప్రశ్నించిన విలేకరిపై సీఎం ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..
Also Read
‘‘మీకు అడగటానికి ఇకేం ప్రశ్నలు లేవా..? ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాని గురించి మాట్లడనివ్వండి. కానీ హైకమాండ్ ఎవరు.? దీని గురించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మాట్లాడారా..’’ అని విలేకరిని సీఎం అడిగారు. ‘‘మీరు ఎప్పుడూ దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు..? ఇప్పుడు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.? హైకమాండ్ కాకుండా దీని గురించి ఎవరు మాట్లాడినా ప్రాముఖ్యత ఉండదు’’ అని ఆయన అన్నారు.
నవంబర్ 6,11 తేదీల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రి వర్గం పునర్వ్యవస్థీకరణ గురించి హైకమాండ్తో మాట్లాడుతానని సిద్ధరామయ్య అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2023లో ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అప్పుడు కాంగ్రెస్ శివకుమార్ను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. దీంతో ఇరువురు నేతల మధ్య పదవీకాలం సమానంగా పంచుకోవాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తానే 5 ఏళ్లు పదవిలో ఉంటానని ఇటీవల సిద్ధరామయ్య చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!