Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
- కర్ణాటక కుర్చీ పంచాయితీకి తెర
- పవర్ ఛేంజ్కు మార్గం సుగమం
- ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి కర్ణాటక కుర్చీ పంచాయితీకి తెరపడింది. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి మార్పుపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ గందరగోళానికి ఫుల్స్టాప్ పెట్టింది. రెండు, మూడు రోజులుగా జాతీయ స్థాయిలో వస్తున్న ఊహాగానాలు ప్రకారమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే లోక్భవన్కు వెళ్లి గవర్నర్కు సిద్ధరామయ్య రాజీనామా లేఖ సమర్పించారు.
ఇక రాజీనామా అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఓటర్లు మా అభిమాన దేవుళ్లు.. హైకమాండ్ రాజీనామా చేయమని చెప్పగానే.. వెంటనే లోక్భవన్కు సమాచారం ఇచ్చా. కాంగ్రెస్ పార్టీ 136 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశం రెండు సార్లు ఇచ్చారు. అధిష్టానానికి ధన్యవాదాలు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అన్ని సంక్రమంగా చేస్తారని భావిస్తున్నా.’’ అని సిద్ధరామయ్య తెలిపారు.
Also Read
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
- Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
- Lok Sabha: ఫలించిన స్పీకర్ చొరవ.. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రేపు చర్చ
‘‘హైకమాండ్ నాకు తెలియజేసినప్పుడల్లా నేను రాజీనామా చేస్తానని చాలాసార్లు చెప్పాను. హైకమాండ్ నన్ను రాజీనామా సమర్పించమని కోరింది. నేను ఎల్లుండి.. అంటే ఈరోజే చేస్తానని వారికి చెప్పాను. అందుకే నేను రాజీనామా సమర్పించాను. నేను గవర్నర్ కార్యాలయానికి నా రాజీనామాను సమర్పించాను. గవర్నర్ లోక్భవన్లో లేరు. ఆయన ఈ రాత్రికి తిరిగి వస్తున్నారు. అందుకే నేను ఆయన కార్యాలయానికి రాజీనామాను సమర్పించాను.’’ అని పేర్కొన్నారు.
గతాన్ని గుర్తుచేసుకుంటూ.. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేకపోవడంతో తాను ఒక “యాదృచ్ఛిక రాజకీయ నాయకుడిని” అని అన్నారు. ఒక సామాన్య నేపథ్యం నుంచి తాను ఎదిగిన తీరును గుర్తుచేసుకుంటూ.. బుద్ధుడు, బసవ, బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ ప్రతిపాదించిన సూత్రాల ప్రకారమే జీవించినట్లు చెప్పారు.
ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలిసి తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. త్వరలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభకు వెళ్తారా? లేదంటే రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
-
Dhoom 4: ‘ధూమ్ 4’ నుంచి రణబీర్ కపూర్ అవుట్ ?… కొత్త హీరో కోసం యశ్ రాజ్ ఫిల్మ్స్ వేట!
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్లపై ప్రభావం!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!