UP: ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి
- ఏడు ప్రమాణాల తర్వాత షాకింగ్ ట్విస్ట్
- పెళ్లిపీటల మీద ఆగిపోయిన తంతు
- ఉత్తరప్రదేశ్లోని ఓ వివాహ వేడుకలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ఓ వివాహ వేడుకలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గ్రాండ్గా పెళ్లి జరుగుతోంది. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడు ప్రమాణాలు, ఆచారాలు కూడా పూర్తయ్యాయి. కొద్దిసేపటిలో వధువు మెడలో తాళి కడితే భార్యాభర్తలు కూడా అయిపోతారు. సరిగ్గా అదే సమయంలో ట్రాన్స్జెండర్లు ఎంట్రీ ఇచ్చారు. అంతే అప్పటి దాకా సందడిగా సాగిన పెళ్లి వేడుకలు కొద్దిసేపటికే నిశ్శబ్దంగా మారిపోయింది. వాళ్లను చూసి వరుడు, బంధువులు లగాయించారు. దీంతో పెళ్లిపీటల మీదనే తంతు ఆగిపోయింది. అసలేం జరిగింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Sergio Gor: ఆటోలో తిరుగుతూ ఇడ్లీ, మసాలా దోస ఆరగించిన అమెరికా రాయబారి.. వీడియో వైరల్
Also Read
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలోని కోఠి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో వివాహం జరుగుతోంది. ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. దీంతో ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయించుకున్నారు. బంధువులు, అతిథులంతా హాజరయ్యారు. ఏడు ప్రమాణాలు, ఆచరాలు కూడా పూర్తయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్జెండర్లు వచ్చారు. పెళ్లి వారి నుంచి కానుకలు అడిగారు. వరుడు తరపు వారు సాధారణంగా ఇచ్చే రూ.1,121కి బదులుగా రూ.23,000 అందించారు. దీంతో ట్రాన్స్జెండర్లకు అనుమానం వచ్చి వధువు బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో వరుడిని పక్కకు తీసుకెళ్లి పరీక్షించగా రహస్య బయటపడింది. తాను అబ్బాయిని కాదని.. ట్రాన్స్జెండర్ అని ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి దాకా సందడిగా సాగిన వేడుక ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
ఇక అసలు రంగు బయట పడగానే వరుడి బంధువులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇద్దరు, ముగ్గురు మహిళలు తప్ప అందరూ వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితమే పెళ్లి నిశ్చయించుకున్నామని.. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదని అమ్మాయి తరపు బంధువులు వాపోయారు. ఇక ఎటువంటి గొడవులు చేయకుండా వివాహ ఖర్చులు తిరిగి చెల్లించాలని అమ్మాయి మామ డిమాండ్ చేశాడు. ఇక వచ్చిన వారికి ఫలహారాలు ఇచ్చి పంపించేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్కు ముప్పు పొంచి ఉందా?
-
Tata Cars Price Hike: టాటా కార్లు కొనేవారికి ఇదే చివరి ఛాన్స్..! పెరగనున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ కార్ల ధరలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!