CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- నిరసనకారులతో మాట్లాడి సంఘీభావం తెలిపిన నేతలు
- రేపు ఉద్ధవ్ ఠాక్రే సందర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమకారులు తమ నిరసన తెలుపుతున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీజేపీ నిరసనకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా జంతర్మంతర్లో సీజేపీ నిరసనకారులను శరద్ పవార్, సుప్రియా సూలే కలిసి మద్దతు తెలిపారు. రేపు ఉద్ధవ్ ఠాక్రే జంతర్ మంతర్ను సందర్శించనున్నారు. సీజేపీ నిరసనకు మద్దతు తెల్పనున్నారు.
సోమవారం సీజేపీ తలపెట్టిన చలో సంసద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. మంగళవారం ప్రతిపక్ష నాయకులతో పాటు కేంద్రమంత్రులు పరామర్శించారు. అయితే ఒక యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
ఇదిలా ఉంటే మంగళవారం ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు రాహుల్ గాంధీతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లు ముందు ఉంచారు. హెచ్ఆర్డీ మంత్రి రాజీనామా, సభలో హోం మంత్రి ప్రకటన, సభలో చర్చ, విద్యార్థుల సమస్యలను వినాలి, నిన్నటి హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే సోమవారం ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడానికి భారీ కుట్ర జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయినా పెద్ద ఎత్తున నిరసనకారులు ఎలా రాగలిగారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. కొంతమంది ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సందేశాలు పంపించుకున్నారు. ఒక సందేశంలో ‘‘రేపే మోడీ ప్రభుత్వానికి చివరి రోజు’’ అని ఉంది. మరోవైపు కొందరు నిరసనకారులు ఉద్యమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!