Orissa High Court: కలిసి ఉండి పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారంగా పరిగణించలేం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Orissa High Court: సహజీవనంపై ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలిసి ఉండీ సెక్స్ చేసుకుని వివాహం చేసుకుంటాననే వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని ఒడిశా హైకోర్టు వ్యాక్యానించింది. భువనేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తి ఎదుర్కొంటున్న అత్యాచారం ఆరోపణల్ని కోర్టు కొట్టేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, కొన్నాళ్లు ఇద్దరు కలిసి ఉండీ, పరస్పర అంగీకారంతో శృంగారం కొనసాగించి, ఆ తరువాత వివాహం జరిగితే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
భర్తతో ఐదేళ్లుగా వివాదంలో ఉన్న ఒక యువతి, పిటిషనర్ కి స్నేహితురాలు. సదరు యువతి పిటిషనర్ పై అత్యాచార ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీ చిత్తశుద్ధితో ఇచ్చి ఆ తరువాత పెళ్లి చేసుకోకపోవడానికి, తప్పుడు వాగ్ధానానికి సూక్ష్మమైన తేడా ఉందని జస్టిస్ ఆర్కే పట్నాయక్ జూలై 3న తన తీర్పులో పేర్కొన్నారు. సదరు యువతి భర్తతో విడాకులు తీసుకోకుండా, ఒక వ్యక్తితో స్నేహం కారణంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న కేసులో ఈ తీర్పును హైకోర్టు వెలువరించింది. మహిళ తనపై మోపిన అత్యాచారం కేసును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశాడు. ఇరువురు ఏడేళ్లపాటు సంబంధాన్ని కొనసాగించారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
Read Also: Yatra-2 Motion Poster: నేను విన్నాను, నేను ఉన్నాను.. యాత్ర-2 మోషన్ పోస్టర్ రిలీజ్!
మొదట్లో స్నేహపూర్వకంగా మొదలై, తర్వాత సంబంధాన్ని పెంచుకున్నట్లయితే, అది ఎప్పుడు అపనమ్మకం, అల్లర్ల కారణంగా సదరు వ్యక్తిపై అత్యాచారానికి పాల్పడిన ముద్ర వేయకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు కూడా విద్యావంతులై మంచిస్థానంలో ఉన్నారని, ఇందులోని పర్యవసానాలు బాగా తెలుసని, ఇద్దరు వేర్వేరుగా ఉంటూ బయటకి కనిపించినా.. వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడిందో అర్థమైందని జస్టిస్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. పిటిషనర్ పై అత్యాచారం ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోర్టు నిర్ణయానికి వచ్చింది.
బాధితురాలితో వివాహానికి హామీ ఇచ్చి ఇద్దరు వ్యక్తులు శారీరక సంబంధాన్ని కొనసాగిస్తే, కొన్ని కారణాల వల్ల అది కుదరకపోగా, వాగ్దానాన్ని ఉల్లంఘించారనే వాదనతో దానిని అత్యాచారంగా పేర్కొనలేమని సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది.
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?