IMD Rain Alert: ఢిల్లీకి తీవ్ర తుఫాన్ హెచ్చరిక.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- దేశంలో తీవ్ర తుఫాన్
- పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- మధ్యప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాయువ్య భారతదేశంలో భారీ తుఫాను ఏర్పడనుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో తీవ్రమైన తుఫాన్ ఏర్పడుతోందని పేర్కొంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా రాష్ట్రాల్లో ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇక గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Iran-US War: ఇరాన్పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి
Also Read
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
ఏప్రిల్ 3, 4 తేదీల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 3-4 తర్వాత ఏప్రిల్ 7-8 తేదీల్లో వాయువ్య భారతదేశంపై చాలా చురుకైన పశ్చిమ అవాంతరం ప్రభావం చూపనుందని పేర్కొంది. దీంతో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ అంతటా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్పై రూ.137, డీజిల్పై రూ.184 పెంపు
మధ్యప్రదేశ్ వార్నింగ్..
ఇక మధ్యప్రదేశ్కు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తదుపరి 2-3 గంటల పాటు తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేవాస్, ఖండ్వా, రత్నం జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. గంటకు సుమారు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. అదే విధంగా గంటకు 15 మి.మీ కంటే ఎక్కువగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
District wise Nowcast Warning valid for next two-three hours:
Red Warnings: Lightning/Thunderstorms with gusty winds (around 60 kmph) and heavy rain (>15 mm/h) very likely over following districts in:Madhya Pradesh: Dewas, Khandwa, Ratlam; pic.twitter.com/pgqGpRwAsV
— India Meteorological Department (@Indiametdept) April 2, 2026
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?