Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- కర్ణాటకలో ఘోర విషాదం
- ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్యాంకర్
- ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విజయనగరలో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ను వెనుక నుంచి అత్యంత వేగంగా ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయనగర జిల్లాలోని టీబీ డ్యామ్ సమీపంలో జాతీయ రహదారి 50పై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఆ తీవ్రతకు రెండు వాహనాలు వంతెన పైనుంచి కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
Also Read
- Karnataka: మైసూర్ పబ్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
- Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
- Kundu couple: దీదీ తృణమూల్ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్సభలోనే కింగ్ మేకర్గా ఎలా మార్చారు!
- PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
బాధితులు హుళిగెమ్మ ఆలయంలో పూజ చేసి ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విజయనగర జిల్లా, కుడ్లిగి తాలూకాలోని మారల్యాన్హళ్లి గ్రామానికి చెందినవారు కాగా.. మిగిలిన వారు బళ్లారి జిల్లా, సాండూర్ తాలూకాలోని యశ్వంత్ నగర్, కుడ్లిగి ప్రాంతంలోని అంకామన్నహళ్లి గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్
-
HYDRAA : హైడ్రా బిగ్ అప్డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!
-
Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
-
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?