Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- కర్ణాటకలో ఘోర విషాదం
- ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్యాంకర్
- ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విజయనగరలో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ను వెనుక నుంచి అత్యంత వేగంగా ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయనగర జిల్లాలోని టీబీ డ్యామ్ సమీపంలో జాతీయ రహదారి 50పై శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఆ తీవ్రతకు రెండు వాహనాలు వంతెన పైనుంచి కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
బాధితులు హుళిగెమ్మ ఆలయంలో పూజ చేసి ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విజయనగర జిల్లా, కుడ్లిగి తాలూకాలోని మారల్యాన్హళ్లి గ్రామానికి చెందినవారు కాగా.. మిగిలిన వారు బళ్లారి జిల్లా, సాండూర్ తాలూకాలోని యశ్వంత్ నగర్, కుడ్లిగి ప్రాంతంలోని అంకామన్నహళ్లి గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘోర ప్రమాదంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!