Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..
- ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..
- దేశ భద్రత.. సార్వభౌమాధికారానికి ప్రమాదం..
- నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hizb-ut-Tahrir: ఐఎస్ఐఎస్ ప్రేరేపిత రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’(HuT)ని కేంద్రం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద ఉగ్రవాద సంస్థగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) గురువారం అధికారికంగా ప్రకటిస్తూ, నిషేధం విధించింది. ఈ ఉగ్రవాద సంస్థ యువకులను మోసపూరితంగా మార్చడంతో పాటు ఉగ్రవాదానికి నిధులు, భారతదేశ జాతీయ భద్రతకు, సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పుగా కలిగిస్తోందని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యలతో UAPA కింది తీవ్రవాద సంస్థగా గుర్తించబడిన 45వ సంస్థగా హిజ్బ్-ఉత్-తహ్రీర్ చేరింది.
Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నరేంద్రమోడీ టెర్రరిజం పట్ట జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నారని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు హిజ్బ్-ఉత్-తహ్రీర్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు వెల్లడించారు.
హోంమంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్లో.. దేశంలోని పౌరులను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించి, జివాద్ ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్యాన్ని, కాలిఫేట్ని స్థాపించాలని లక్ష్యంతో పనిచేస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశ అంతర్గత భద్రతకు ఈ సంస్థ తీవ్ర ముప్పుగా మారిందని పేర్కొంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ద్వారా యువతను మోసపూరితంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడేలా చేస్తుందని, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పింది.
Pursuing PM Shri @narendramodi Ji's policy of zero tolerance towards terrorism, the MHA today declared ‘Hizb-Ut-Tahrir’ as a 'Terrorist Organisation'. The outfit is involved in various acts of terror, including radicalising the gullible youths to join terrorist organisations and…
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) October 10, 2024
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!