Senior advocate R Venkataramani appointed Attorney General of India: భారత అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ అత్యతున్నత న్యాయ అధికారిగా వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కొత్త అటార్నీ జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.
వెంకటరమణి గతంలో లా కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఆమ్రపాలి హౌసింగ్ కేసులో గృహ కొనుగోలుదారులకు రిసీవర్, అమికస్ గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్ గా నియమితులు అయిన వెంకటరమణి మూడేళ్ల కాలానికి పనిచేయనున్నారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ అటార్నీ జనరల్ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడంతో వెంకటరమణిని ఎంపిక చేశారు.
Read Also: Ahmedabad: అంతర్జాతీయ ఎయిర్పోర్టులను తలదన్నేలా అహ్మదాబాద్ రైల్వేస్టేషన్.. ఫోటోలు వైరల్
1977 తమిళనాడు బార్ కౌన్సిల్ లో చేరిన వెంకటరమణి 1982 లో సుప్రీంకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1997లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 201లో లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితులయ్యారు. వెంకటరమణి సుప్రీంకోర్టులో 42 ఏళ్లు ప్రాక్టీస్ పూర్తి చేశారు. 2004 -2010 మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టల్లో భారత ప్రభుత్వం వివిధ విభాగాలకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా కూడా ఉన్నారు. 1990లో భారత ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంక్షేమ చట్టాల నిపుణుల బృందంలో న్యాయ సభ్యుడిగా పనిచేశారు.