CP. Radhakrishnan: ఉపరాష్ట్రపతి పర్యటనలో భద్రతా లోపం.. స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
- ఉపరాష్ట్రపతి పర్యటనలో భద్రతా లోపం
- స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాధాకృష్ణన్ పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Delhi High Court: ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’.. కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
అయితే కోయంబత్తూరులో భద్రతా లోపం కనిపించింది. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా ఇద్దరు యువకులు స్కూటర్ నడుపుకుంటూ వచ్చేశారు. దీంతో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. ఈ సంఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వహించారంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. వీవీఐపీ భద్రతా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
కోయంబత్తూరులోని కోడిసియాలో కోయంబత్తూరు సిటిజన్ ఫోరం… రాధాకృష్ణన్కు ఘనంగా సత్కారం చేశారు. గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు చెప్పారు. విక్షిత్ భారత్ సాధించడానికి సమిష్టి కృషి అవసరం అన్నారు. దేశ పురోగతికి ప్రతి ప్రాంతం కీలకమైన సహకారాన్ని అందించాలని కోరారు. కోయంబత్తూరుతో సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజల శ్రమశక్తి, ఔత్సాహిక స్వభావాన్ని ప్రశంసించారు. ఆ లక్షణాలే నగరాన్ని ఉత్సాహంగా, శక్తివంతంగా, సంపన్నంగా మార్చాయని కొనియాడారు. భారత్ను సంపన్న దేశంగా మార్చడానికి పరిశ్రమలు, తయారీ, వాణిజ్యం వృద్ధి అవసరమని చెప్పారు. విక్షిత్ భారత్ సాధించడానికి ప్రతి వ్యక్తి సహకరించాలని.. ఈ ప్రయాణంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి కోయంబత్తూరులోని టౌన్ హాల్ కార్పొరేషన్ భవనాన్ని సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇది కూడా చదవండి: Trump Dance: జపాన్లోనూ మరోసారి డ్యాన్స్తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్
అటు తర్వాత కోయంబత్తూరులోని పేరూర్ మఠంలో జరిగిన శాంతలింగ రామసామి అడిగలర్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విలువలను వ్యాప్తి చేయడంలో.. విద్యను ప్రోత్సహించడంలో.. క్రమశిక్షణ, సామరస్యపూర్వక సమాజాన్ని పెంపొందించడంలో అడిగలర్ జీవితాంతం చేసిన సేవలను రాధాకృష్ణన్ ప్రశంసించారు.
ఇక పర్యటనలో భాగంగా అక్టోబర్ 29న తిరుప్పూర్లో రాధాకృష్ణన్కు సన్మానం జరగనుంది. సాయంత్రం మధురై చేరుకుని మధురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. అనంతరం అక్టోబర్ 30న రామనాథపురం జిల్లాలోని పసుంపొన్లో జరిగే పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ జయంతి కార్యక్రమానికి హాజరవుతారు.
తాజావార్తలు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..