Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!
- సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా?
- మే 29న జరగాల్సిన డ్రిల్స్ 31కి వాయిదా
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మాక్డ్రిల్ మే 31కి వాయిదా పడింది. పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్లో మే 29న భద్రతా విన్యాసాలు చేయాలని కేంద్రం ఆదేశించింది. పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా డ్రిల్స్ను మే 31కి మార్చారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకే అవగాహన కల్పించడం కోసం ఈ డ్రిల్స్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Off The Record: ఏ విషయంలో వీహెచ్ కు కోపమొచ్చింది?
Also Read
- PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
- UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- IRS Officer Daughter Murder: నిందితుడి తీరుపై కోర్టుకు పోలీసులు షాకింగ్ రిపోర్ట్.. ఏముందంటే..!
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
మే 31 సాయంత్రం పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో భద్రతా సంస్థలు భద్రతా విన్యాసాలు నిర్వహిస్తాయని వర్గాలు తెలిపాయి. అవగాహన కల్పించడం లక్ష్యంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్లో ఈ విన్యాసాలు జరగనున్నాయి. పరిపాలనా కారణాల కారణంగా మే 29న జరగాల్సిన డ్రిల్స్ 31కి వాయిదా పడింది. ఇటీవల కాలంలో సరిహద్దు అవతల నుంచి భారీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి నెల ఇటువంటి విన్యాసాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. విన్యాసాల సమయంలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని… అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Covid-19: ఆ కోవిడ్ రోగిని చంపేయండి.. సీనియర్ సర్జన్ ఆడియో వైరల్
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
తాజావార్తలు
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!