DK Shivakumar: అవినీతిలో బీజేపీ పాలకులదే అగ్రస్ధానం..
- కర్ణాటకలో బీజేపీ హయంలో పలు కుంభకోణాలు..
- కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగింది..
- బీజేపీ ప్రభుత్వ హయంలో రూ. 300 కోట్ల అవినీతి: డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటకలో గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్ లో చోటు చేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపణలు చేశారు. కాషాయ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని మండిపడ్డారు. ఈ విషయాలన్నీ తాము అసెంబ్లీ ముందుంచుతామన్నారు. ఇవాళ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన కుంభకోణాలు వెలుగు చూశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ పాలకులకు అవినీతిలో తిరుగులేదన్నారు. బీజేపీ నేతల అవినీతి, కుంభకోణాలపై ఎంక్వైరీలు కొనసాగుతున్నాయి.. దోషులను తమ ప్రభుత్వం శిక్షిస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కాగా, గత పదేళ్లలో బీజేపీ హయాంలో కమలం పార్టీ పాలకులు ఏకంగా 15, 16 ప్రభుత్వాలను కుప్పకూల్చారని అంతకు ముందు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also: Microsoft Outage : ప్రపంచ వ్యాప్తంగా క్రాష్ అయిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్.. విమాన సేవలకు అంతరాయం
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఇక, విపక్ష ప్రభుత్వాన్ని కూల్చడంతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విధానమే ప్రత్యర్ధి ప్రభుత్వాలను అస్ధిరపరచడమన్నారు. ఇప్పుడు కూడా ఇదే తంతు కొనసాగుతుందన్నారు. అవినీతి కుంభకోణాల్లో సీఎం, డిప్యూటీ సీఎంల పేర్లు చెప్పాలని తమ అధికారులను, నేతలను బీజేపీ నేతలు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఉపయోగిస్తామని కర్ణాటక కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ప్రత్యర్ధి పార్టీల ప్రభుత్వాలను కూలదోసే కుట్రలు కమలం పార్టీకి వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ అదే విధానాలను కొనసాగిస్తుందన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!