PM Modi: “మతిలేని వాళ్లు ఇలాగే అంటారు”.. రాహుల్ గాంధీపై పీఎం ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
Read Also: Dubai: భారతీయుల కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన గల్ఫ్ కంట్రీ..
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు మాత్రమే తన కాశీ ప్రజల్ని తాగుబోతులు అంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ ‘షాహీ పరివార్’, ‘యువరాజ్’ వారణాసి ప్రజల్ని తమ సొంతగడ్డపై అవమానించారని అన్నారు. ‘‘ ఇదేం భాష.. రెండు దశాబ్ధాలుగా మోడీని తిడుతూనే ఉన్నారని, ఇప్పుడు యూపీ యువతపై తమ నైరాశ్యాన్ని బయటపెడుతున్నారని ’’మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ యువకుల పట్ల ఇండియా కూటమి చేసిన అవమానాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేదనని ఆయన అన్నారు. ఇది వారి వాస్తవిక పరిస్థితి అని.. యువత ప్రతిభకు వారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాశీ, అయోధ్య కొత్త రూపాన్ని ఇండియా కూటమి నాయకులు చూడలేకపోతున్నారని ప్రధాని అన్నారు. పరివార్వాద రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపుల వల్ల దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు కలిసి వస్తారని, చివకు ఫలితం శూన్యమని, మళ్లీ వారు విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటారని విమర్శించారు. ఈ సారి మొత్తం దేశం మూడ్ మోడీ హామీకి అనుకూలంగా ఉందని, యూపీలో అన్ని సీట్లు ఎన్డీయేకే వస్తాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!