PM Modi: “మతిలేని వాళ్లు ఇలాగే అంటారు”.. రాహుల్ గాంధీపై పీఎం ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
Read Also: Dubai: భారతీయుల కోసం 5 ఏళ్ల మల్టీపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన గల్ఫ్ కంట్రీ..
Also Read
- Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
- IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
- Viral News: ఫేమస్ కావాలనే కోరికతో దిక్కుమాలిన పని.. భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసిన భర్త.. కట్చేస్తే..
- Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు మాత్రమే తన కాశీ ప్రజల్ని తాగుబోతులు అంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ ‘షాహీ పరివార్’, ‘యువరాజ్’ వారణాసి ప్రజల్ని తమ సొంతగడ్డపై అవమానించారని అన్నారు. ‘‘ ఇదేం భాష.. రెండు దశాబ్ధాలుగా మోడీని తిడుతూనే ఉన్నారని, ఇప్పుడు యూపీ యువతపై తమ నైరాశ్యాన్ని బయటపెడుతున్నారని ’’మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ యువకుల పట్ల ఇండియా కూటమి చేసిన అవమానాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేదనని ఆయన అన్నారు. ఇది వారి వాస్తవిక పరిస్థితి అని.. యువత ప్రతిభకు వారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కాశీ, అయోధ్య కొత్త రూపాన్ని ఇండియా కూటమి నాయకులు చూడలేకపోతున్నారని ప్రధాని అన్నారు. పరివార్వాద రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపుల వల్ల దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు కలిసి వస్తారని, చివకు ఫలితం శూన్యమని, మళ్లీ వారు విడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటారని విమర్శించారు. ఈ సారి మొత్తం దేశం మూడ్ మోడీ హామీకి అనుకూలంగా ఉందని, యూపీలో అన్ని సీట్లు ఎన్డీయేకే వస్తాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
-
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
-
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
-
Virat Kohli: “ప్రత్యర్థిగా మొదలై మంచి స్నేహితుడిగా మారావు”.. కేన్ రిటైర్మెంట్పై విరాట్ కోహ్లీ ఎమోషనల్!
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!