Tejashwi Yadav Vs BJP: తేజస్వి యాదవ్పై సతీష్ కుమార్ పోటీ.. బ్యాగ్రౌండ్ ఇదే!
- తేజస్వి యాదవ్పై సతీష్ కుమార్ పోటీ
- సతీష్ కుమార్ బ్యాగ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్ను బీజేపీ రంగంలోకి దింపింది.
సతీష్ కుమార్ యాదవ్..
సతీష్ కుమార్ యాదవ్ ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం 2005లో జేడీయూలో చేరారు. 2005లో రఘోపూర్లో రబ్రీ దేవిపై పోటీ చేసి సతీష్ కుమార్ యాదవ్ ఓటమి పాలయ్యారు. కానీ 2010లో మాత్రం రబ్రీదేవిని 13,06 ఓట్ల తేడాతో సతీష్ కుమార్ యాదవ్ ఓడించారు. ఈ ఎన్నికల్లో సతీష్కు 64, 222 ఓట్లు రాగా.. రబ్రీదేవికి 51, 216 ఓట్లు వచ్చాయి. తిరిగి 2015లో తేజస్వి యాదవ్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
- PM-Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ వారమే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
ఇది కూడా చదవండి: Modi Trump Meeting: రష్యా నుండి చమురు కొనుగోలు ఆపబోతున్న భారత్.. ట్రంప్ ఏమన్నారంటే?
రఘోపూర్ నియోజకవర్గం వైశాలి జిల్లాలో ఉంది. ఈ రఘోపూర్ నియోజకవర్గం రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను అందించిన నియోజకవర్గం. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఈ నియోజకవర్గం కంచుకోట లాంటింది. లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2000 సంవత్సరాల్లో రెండు సార్లు గెలిచారు. ఇక ఆయన భార్య రబ్రీ దేవి మూడు సార్లు విజయం సాధించారు. ఇక వారి కుమారుడు తేజస్వి యాదవ్ 2015, 2020లో రెండు సార్లు గెలుపొందారు. తాజాగా మరోసారి ఇక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
రఘోపూర్లో 31 శాతం యాదవ్ కులస్థులు ఉంటారు.
ఇది కూడా చదవండి: Radhika Apte : హీరోల కోసమే సినిమాలు చేస్తారా.. రాధిక ఆప్టే ఫైర్
ఎన్డీఏ కూటమిలో బీజేపీ-జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మంగళవారం 71 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఇక బుధవారం ఉదయం 12 మందితో రెండు జాబితా, రాత్రి 18 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. 101 అభ్యర్థుల్లో 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 243 స్థానాలకు రెండు దశలుగా జరిగే బీహార్ ఎన్నికలకు 101 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
-
Womens T20 World Cup: పాకిస్థాన్పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
-
US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?