Tejashwi Yadav Vs BJP: తేజస్వి యాదవ్పై సతీష్ కుమార్ పోటీ.. బ్యాగ్రౌండ్ ఇదే!
- తేజస్వి యాదవ్పై సతీష్ కుమార్ పోటీ
- సతీష్ కుమార్ బ్యాగ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్ను బీజేపీ రంగంలోకి దింపింది.
సతీష్ కుమార్ యాదవ్..
సతీష్ కుమార్ యాదవ్ ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం 2005లో జేడీయూలో చేరారు. 2005లో రఘోపూర్లో రబ్రీ దేవిపై పోటీ చేసి సతీష్ కుమార్ యాదవ్ ఓటమి పాలయ్యారు. కానీ 2010లో మాత్రం రబ్రీదేవిని 13,06 ఓట్ల తేడాతో సతీష్ కుమార్ యాదవ్ ఓడించారు. ఈ ఎన్నికల్లో సతీష్కు 64, 222 ఓట్లు రాగా.. రబ్రీదేవికి 51, 216 ఓట్లు వచ్చాయి. తిరిగి 2015లో తేజస్వి యాదవ్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- Rahul Gandhi-Kiren Rijiju: సభలో ఫైటింగ్.. బయట ముచ్చట్లు.. రాహుల్గాంధీ-కిరణ్ రిజిజు సరదా సంభాషణ
ఇది కూడా చదవండి: Modi Trump Meeting: రష్యా నుండి చమురు కొనుగోలు ఆపబోతున్న భారత్.. ట్రంప్ ఏమన్నారంటే?
రఘోపూర్ నియోజకవర్గం వైశాలి జిల్లాలో ఉంది. ఈ రఘోపూర్ నియోజకవర్గం రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను అందించిన నియోజకవర్గం. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఈ నియోజకవర్గం కంచుకోట లాంటింది. లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2000 సంవత్సరాల్లో రెండు సార్లు గెలిచారు. ఇక ఆయన భార్య రబ్రీ దేవి మూడు సార్లు విజయం సాధించారు. ఇక వారి కుమారుడు తేజస్వి యాదవ్ 2015, 2020లో రెండు సార్లు గెలుపొందారు. తాజాగా మరోసారి ఇక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
రఘోపూర్లో 31 శాతం యాదవ్ కులస్థులు ఉంటారు.
ఇది కూడా చదవండి: Radhika Apte : హీరోల కోసమే సినిమాలు చేస్తారా.. రాధిక ఆప్టే ఫైర్
ఎన్డీఏ కూటమిలో బీజేపీ-జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మంగళవారం 71 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఇక బుధవారం ఉదయం 12 మందితో రెండు జాబితా, రాత్రి 18 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. 101 అభ్యర్థుల్లో 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 243 స్థానాలకు రెండు దశలుగా జరిగే బీహార్ ఎన్నికలకు 101 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!