Site icon NTV Telugu

Sanjay Raut: అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర.. ఉద్ధవ్ ఎంపీ ఆరోపణ..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న బారామతి ఎయిర్‌పోర్టులో జరిగిన ఫ్లైట్ క్రాష్‌లో మరణించారు. ఈ ప్రమాదంపై ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సంఘటన అనుమానాస్పదంగా ఉందని అభివర్ణించారు. సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మీడియాలో మాట్లాడుతూ.. అజిత్ పవార్ స్థాయి, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల దృష్ట్యా అనుమానాలు రావడం ఖమని అన్నారు.

Read Also: Oppo A6i+ 5G: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ ప్రాసెసర్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌లు విడుదల

అజిత్ పవార్ మరణానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలను పరిశించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ అన్నారు. అజిత్ పవార్, శరద్ పవార్‌‌ల ఎన్సీపీలు కలిసిపోవాలనే కోరిక వ్యక్తం చేశారని, బీజేపీ సించాన్ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లతో బెదిరించారని రౌత్ అరోపించారు. ఈ ఆరోపణలపై అజిత్ పవార్ స్పందించిన తర్వాత పదిరోజుల్లోనే మరణించారని, దీనిపై అనుమానం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం, ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూర్(AAIB) దర్యాప్తు ప్రారంభించింది. బ్లా్క్‌బాక్స్‌ను రికవర్ చేశామని, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చెప్పారు. బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మరణించారు. అజిత్ పవార్ మరణం తర్వాత, ఆయన భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Exit mobile version