Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
- ఉద్ధవ్ శివసేనలో ఎంపీల తిరుగుబాటు..
- తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు ఢిల్లీకి..
- ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్లు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanhay Raut: ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వర్గంగా మారింది. ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుగుబాటు చేసిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. వీరంతా స్పీకర్ను తమది ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఎదురైన పరిస్థితులే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎదుర్కోంటోంది.
ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, పార్టీని వీడాలనుకునే ఎంపీలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు. తీవ్రస్థాయిలో బూతులు తిట్టాడు. ఈ వెధవలు వెళ్లిపోవాలి అని ఆగ్రహంగా అన్నారు. ద్రోహం చేయడం వారి రక్తంలో ఉందని దుయ్యబట్టారు. తన తిట్లను బీప్ చేయవద్దని కోరుతూనే, మరాఠీలతో ఇలాంటి పదజాలం వాడటం సాధారణమే అని అన్నారు. తప్పు చేసిన వారిపై, అవినీతికి పాల్పడిన వారిపై మనం పూలు కురిపిస్తామా.? అని ప్రశ్నించారు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
ఇదే కాకుండా, ఎంపీలను డబ్బులతో కొంటున్నారని మండిపడ్డారు. తిరుగుబాటు చేయడానికి ఎంపీలకు ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారనే విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, కొందరు ఎంపీలు పక్షం మారేందుకు రూ. 50 కోట్లను కూడా ఆఫర్ చేస్తు్న్నారని ఆరోపించారు. ఎంపీల కొనుగోలు ప్రయత్నంపై మంగళవారం రాత్రి ఒక వ్యక్తి తనకు సమాచారం ఇచ్చారని, రూ. 50 కోట్లలో, రూ. 15 కోట్లు ఈ రాత్రికి అందుతాయని, డబ్బు చేతికి అందిన తర్వాతే ఎంపీలు విమానం ఎక్కారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?