Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
- ఉద్ధవ్ శివసేనలో ఎంపీల తిరుగుబాటు..
- తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు ఢిల్లీకి..
- ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్లు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanhay Raut: ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వర్గంగా మారింది. ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుగుబాటు చేసిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. వీరంతా స్పీకర్ను తమది ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఎదురైన పరిస్థితులే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎదుర్కోంటోంది.
ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, పార్టీని వీడాలనుకునే ఎంపీలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు. తీవ్రస్థాయిలో బూతులు తిట్టాడు. ఈ వెధవలు వెళ్లిపోవాలి అని ఆగ్రహంగా అన్నారు. ద్రోహం చేయడం వారి రక్తంలో ఉందని దుయ్యబట్టారు. తన తిట్లను బీప్ చేయవద్దని కోరుతూనే, మరాఠీలతో ఇలాంటి పదజాలం వాడటం సాధారణమే అని అన్నారు. తప్పు చేసిన వారిపై, అవినీతికి పాల్పడిన వారిపై మనం పూలు కురిపిస్తామా.? అని ప్రశ్నించారు.
Also Read
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Indian Railways: రైలులోనే "శోభనం గది".. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
- El Nino: భారత్కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
ఇదే కాకుండా, ఎంపీలను డబ్బులతో కొంటున్నారని మండిపడ్డారు. తిరుగుబాటు చేయడానికి ఎంపీలకు ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారనే విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, కొందరు ఎంపీలు పక్షం మారేందుకు రూ. 50 కోట్లను కూడా ఆఫర్ చేస్తు్న్నారని ఆరోపించారు. ఎంపీల కొనుగోలు ప్రయత్నంపై మంగళవారం రాత్రి ఒక వ్యక్తి తనకు సమాచారం ఇచ్చారని, రూ. 50 కోట్లలో, రూ. 15 కోట్లు ఈ రాత్రికి అందుతాయని, డబ్బు చేతికి అందిన తర్వాతే ఎంపీలు విమానం ఎక్కారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
-
Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
-
Wamiqa Gabbi: సుమో రెజ్లర్ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
-
Yamaha Aerox-e: భారత మార్కెట్లో యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..