Sandeshkhali: సందేశ్ఖాలీ ఘటనలో “ప్రభావవంతమైన” వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: దేశంలో రాజకీయంగా చర్చనీయాంశమైన పశ్చిమ బెంగాల్ సందేశ్ఖాలీ మహిళల లైంగిక వేధింపులు, భూకబ్జా, హింసకు సంబంధించిన కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఐదుగురు ప్రభావవంతమైన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ గురువారం వెల్లడించారు. అయితే వీరి గుర్తింపును సీబీఐ బయలకు చెప్పలేదు. కేవలం ప్రభావంతమైన వ్యక్తులుగా పేర్కొంది. కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 10 ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షలో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఫిర్యాదులు చేయడానికి సీబీఐ ఓ ఈమెయిల్ ఐడీని కూడా ప్రచారం చేసింది. గత వారం సీబీఐకి చెందిన 10 మంది అధికారులు సందేశ్ఖాలీని సందర్శించి మహిళలపై నేరాలు, భూకజ్జాలపై విచారణ జరిపింది.
Read Also: Rashmika mandhana: మరోసారి రెమ్యూనరేషన్ ను పెంచేసిన రష్మిక మందన్న?
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
లోక్సభ ఎన్నికల ముందు సందేశ్ఖాలీ సంఘటనలో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోయింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన షేక్ షాజహాన్, అతని ఇతర అనుచరులు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్ఖాలీలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇదే కాకుండా భూకజ్జాలకు పాల్పడ్డారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు షేక్ షాజహాన్కి వ్యతిరేకంగా తిరబడ్డారు. దీంతో అతను 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు.
మహిళల ఉద్యమానికి బీజేపీ మద్దతుగా నిలిచింది. సీఎం మమతా బెనర్జీ అండతోనే టీఎంసీ గుండాలు రెచ్చిపోతున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు, గవర్నర్ స్పందించడంతో బెంగాల్ పోలీసులు షేక్ షాజహాన్ని 55 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఈ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. దీనిని ఛాలెంజ్ చేస్తూ మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు జనవరి 5న సందేశ్ఖాలీలో రేషన్ కుంభకోణాన్ని విచారణ జరిపేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత అతని అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!