Sambhal Violence: యోగితో అట్లుంటది.. సంభాల్ హింసకు పాల్పడి వారి నుంచి నష్టపరిహారం..
- సంభాల్లో ఇటీవల హింసాత్మక దాడి..
- మసీదు సర్వేని అడ్డుకున్న గుంపు..
- రాళ్ల దాడి చేసిన వారి నుంచి రికవరీ చేసేందుకు యూపీ సర్కార్ సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్ నగరం తీవ్రమైన హింసతో అట్టుడికింది. స్థానిక షాహీ జామా మసీదు సర్వేకు వెళ్లిన వారిపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. పోలీసులు, ఇతర అధికారులపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయాల్సివచ్చింది. ఈ హింసలో నలుగురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. వాహనాలు, స్థానికులు ఇళ్లను గుంపు ధ్వంసం చేసింది. సంభాల్లోని జామా మసీదు ఒకప్పటి హరిహర్ ఆలయమని హిందూ పక్షం కేసు ఫైల్ చేయడంతో, కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Maharashtra CM: కొనసాగుతున్న ‘‘మహా’’ సస్పెన్స్.. సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
- Udhayanidhi Stalin: ‘‘భర్త కోసం భార్య వెతుకుతోంది’’.. విజయ్పై పర్సనల్ అటాక్..
- Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
ఇదిలా ఉంటే రాళ్లదాడి చేసిన వారి పోస్టర్లను ప్రదర్శించేందుకు యూపీ సర్కార్ సిద్ధమైనట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. ‘‘సంభాల్ హింసాకాండలో పాల్గొన్న వ్యక్తులకు వ్యతిరేకంగా UP ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబిస్తోంది. రాళ్లదాడికి పాల్పడిన సంఘవిద్రోహ శక్తుల పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శిస్తాము. నష్టపరిహారాన్ని రికవరీ చేస్తాము. వారి అరెస్టు కోసం సహకరించిన వారికి రివార్డు కూడా ఇస్తాము’’ అని యూపీ అదికార ప్రతినిధి వెల్లడించారు.
యూపీ సర్కార్ 2020లో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొని విధ్వంసాన్ని సృష్టించిన వ్యక్తుల పోస్టర్లను కూడా ఇలాగే ప్రదర్శించారు. అయితే, కోర్టు ఆదేశాలతో వీటిని తర్వాత తొలగించారు. సంభాల్ హింసలో ఇప్పటి వరకు 25 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. 7 ఏఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సమాజ్వాదీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహ్మద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్తో సహా 2750 మంది గుర్తుతెలియని అనుమానితులపై కేసులు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!