Sambhal violence: సంభాల్ హింసలో సంచలన విషయాలు.. ఆడియోలో ఆయుధాలు తేవాలని ఆదేశం..
- సంభాల్ హింసలో కీలక విషయాలు వెలుగులోకి..
- బయటపడిన ఆడియో క్లిప్..
- ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..
Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
అయితే, ఈ ఘటనలో ఎక్కువ మంది మసీదు ఉన్న ప్రాంతానికి వచ్చారు..? ఎలా ఆయుధాలను సమీకరించారనే వివరాలతో కూడి ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల నుంచి ఆడియో క్లిప్ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు దగ్గరకు ఎక్కువమందిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు. ‘‘సామన్ లేకర్ ఆ మస్జద్ కే పాస్. మేరే భాయ్ కా ఘర్ హై(ఆయుధాలు తీసుకుని మసీదు దగ్గరికి రండి, నా సోదరుడి ఇల్లు సమీపంలో ఉంది)’’అని ఆడియోలో చెప్పబడింది.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: OTT : ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేరార్కారు. హింసకు రెండు రోజుల ముందు బార్క్ షాహీ జామా మసీదు ప్రార్థనలకు వచ్చి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో పురాతన హరిహర్ దేవాలయం ఉందని దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం మసీదు సమీపంలో ఆందోళనకారులు, సర్వే బృందంపై దాడికి దిగారు. మొఘల్ రాజు బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని హిందూ పక్షం పిటిషన్ దాఖలు చేసింది. దీనికి చారిత్రక మొఘల్ గ్రంథాలు ‘‘బాబార్ నామా’’, ఐన్ ఏ అక్బరీలో ఉన్న వివరాలను హిందూ పక్షం కోర్టు ముందుంచింది. మరోవైపు ముస్లిం పక్షం 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కోర్టు ఉత్తర్వులు దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. 1947 ఆగస్టు 15 తర్వాత ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటి స్థితిని మార్చొద్దని ప్రార్థనా స్థలాల చట్టం సూచిస్తుంది.
తాజావార్తలు
-
IPL Historic Day: బ్యాట్స్మెన్ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
-
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!