Sambhal violence: సంభాల్ హింసలో సంచలన విషయాలు.. ఆడియోలో ఆయుధాలు తేవాలని ఆదేశం..
- సంభాల్ హింసలో కీలక విషయాలు వెలుగులోకి..
- బయటపడిన ఆడియో క్లిప్..
- ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
అయితే, ఈ ఘటనలో ఎక్కువ మంది మసీదు ఉన్న ప్రాంతానికి వచ్చారు..? ఎలా ఆయుధాలను సమీకరించారనే వివరాలతో కూడి ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల నుంచి ఆడియో క్లిప్ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు దగ్గరకు ఎక్కువమందిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు. ‘‘సామన్ లేకర్ ఆ మస్జద్ కే పాస్. మేరే భాయ్ కా ఘర్ హై(ఆయుధాలు తీసుకుని మసీదు దగ్గరికి రండి, నా సోదరుడి ఇల్లు సమీపంలో ఉంది)’’అని ఆడియోలో చెప్పబడింది.
Also Read
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
- NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Tamil Nadu Assembly: బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి భారీ మద్దతు..!
Read Also: OTT : ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేరార్కారు. హింసకు రెండు రోజుల ముందు బార్క్ షాహీ జామా మసీదు ప్రార్థనలకు వచ్చి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో పురాతన హరిహర్ దేవాలయం ఉందని దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం మసీదు సమీపంలో ఆందోళనకారులు, సర్వే బృందంపై దాడికి దిగారు. మొఘల్ రాజు బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని హిందూ పక్షం పిటిషన్ దాఖలు చేసింది. దీనికి చారిత్రక మొఘల్ గ్రంథాలు ‘‘బాబార్ నామా’’, ఐన్ ఏ అక్బరీలో ఉన్న వివరాలను హిందూ పక్షం కోర్టు ముందుంచింది. మరోవైపు ముస్లిం పక్షం 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కోర్టు ఉత్తర్వులు దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. 1947 ఆగస్టు 15 తర్వాత ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటి స్థితిని మార్చొద్దని ప్రార్థనా స్థలాల చట్టం సూచిస్తుంది.
తాజావార్తలు
-
PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు ‘కాన్వాయ్’ కట్ చేసిన ప్రధాని మోడీ!
-
Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
-
Peddi :‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ విడియోతో సోషల్ మీడియా షేక్..!
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!