Sambhal violence: సంభాల్ హింసలో సంచలన విషయాలు.. ఆడియోలో ఆయుధాలు తేవాలని ఆదేశం..
- సంభాల్ హింసలో కీలక విషయాలు వెలుగులోకి..
- బయటపడిన ఆడియో క్లిప్..
- ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal violence: సంభాల్ హింసకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆడియో క్లిప్లో ఈ కుట్రకు సంబంధించిన కీలక విషయాలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లోని జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులు, పోలీసులుపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. ఈ హింసాత్మక ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 20 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు పలు ఇళ్లు ధ్వంసం చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు.
అయితే, ఈ ఘటనలో ఎక్కువ మంది మసీదు ఉన్న ప్రాంతానికి వచ్చారు..? ఎలా ఆయుధాలను సమీకరించారనే వివరాలతో కూడి ఓ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల నుంచి ఆడియో క్లిప్ని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తి మొఘల్ కాలం నాటి షాహీ జామా మసీదు దగ్గరకు ఎక్కువమందిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు. ‘‘సామన్ లేకర్ ఆ మస్జద్ కే పాస్. మేరే భాయ్ కా ఘర్ హై(ఆయుధాలు తీసుకుని మసీదు దగ్గరికి రండి, నా సోదరుడి ఇల్లు సమీపంలో ఉంది)’’అని ఆడియోలో చెప్పబడింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: OTT : ఓటీటీలో రిలీజ్ అయిన ప్రియదర్శి, టోవినో థామస్ సినిమాలు
ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మొహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేరార్కారు. హింసకు రెండు రోజుల ముందు బార్క్ షాహీ జామా మసీదు ప్రార్థనలకు వచ్చి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో పురాతన హరిహర్ దేవాలయం ఉందని దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం మసీదు సమీపంలో ఆందోళనకారులు, సర్వే బృందంపై దాడికి దిగారు. మొఘల్ రాజు బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని హిందూ పక్షం పిటిషన్ దాఖలు చేసింది. దీనికి చారిత్రక మొఘల్ గ్రంథాలు ‘‘బాబార్ నామా’’, ఐన్ ఏ అక్బరీలో ఉన్న వివరాలను హిందూ పక్షం కోర్టు ముందుంచింది. మరోవైపు ముస్లిం పక్షం 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కోర్టు ఉత్తర్వులు దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. 1947 ఆగస్టు 15 తర్వాత ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో వాటి స్థితిని మార్చొద్దని ప్రార్థనా స్థలాల చట్టం సూచిస్తుంది.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!