Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
- సంభాల్ హింస కేసులో మరో 10 మంది అరెస్ట్..
- ఒకరికి పాక్ ఐఎస్ఐ, దావూద్ ముఠాతో సంబంధం..
- హింస సమయంలో కాల్పులు జరిపిన అఫ్రోజ్..
- కాల్పుల్లో మరణించిన ఇద్దరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal violence: గతేడాది నవంబర్ 24న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లో జరిగిన హింసత యావత్ దేశంలో సంచలనంగా మారింది. షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన బృందంపై అల్లరి మూకలు దాడి చేశాయి. మసీదు సర్వేకి అంతరాయం కలిగించేందుకు ఓ వర్గం రాళ్లదాడికి పాల్పడింది. ఈ ఘటనలో పలువురు అధికారులు గాయపడ్డారు. నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ కేసులుని యోగి సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఈ అల్లర్లో పాల్గొన్న మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంభాల్లోని షాహీ జామా మసీదు, ఒకప్పటి హరిహర్ మందిరమని హిందూ పక్షం కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిపై కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 24, 2024లో సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడి జరిగింది.
Read Also: Hair care: ఈ మూడు రకాల నూనెలు జుట్టుకు పట్టిస్తే.. దృఢంగా మారడం ఖాయం?
Also Read
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 21 మంది మృతి, పలువురికి గాయాలు.!
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
వీరిలో ముల్లా అఫ్రోజ్ అనే వ్యక్తికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు ఏఎస్పీ శ్రీ చంద్ర ఆదివారం తెలిపారు. అరెస్టు చేయబడిన వారిలో తొమ్మిది మంది అల్లర్ల సమయంలో పోలీసులపై రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, మరొకరు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ హింసాకాండలో అఫ్రోజ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బిలాల్ అన్సారీ, అయాన్ అనే ఇద్దరు యువకులు అఫ్రోజ్ జరిపిన కాల్పుల్లో మరణించారని, గందరగోళ సమయంలో మరణించిన నలుగురిలో వీరు కూడా ఉన్నారని వెల్లడించారు.
ముల్లా అఫ్రోజ్ ఉత్తరప్రదేశ్లోని మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకరైన గ్యాంగ్స్టర్ షరీక్ సాతాతో సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తమ దర్యాప్తులో కనుగొన్నారు. దుబాయ్ నుండి భారతదేశంలో తన ముఠా నెట్వర్క్ను నడుపుతున్న సాతాతో ఆఫ్రోజ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని పోలీసులు తెలిపారు. షరీక్ సాతా పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధం కలిగి ఉన్నాడని, ISI తో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. సంభాల్కి చెందిన సతాపై యూపీ, ఢిల్లీలో 50కి పైగా కేసులు ఉన్నాయి. నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించి కొన్నేళ్ల క్రితం దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి భారత నిఘా సంస్థలు ఇతడి కోసం వెతుకుతున్నాయి.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!