UP News: మహిళా లాయర్పై సమాజ్వాదీ పార్టీ నాయకుడి అత్యాచారం..
- మహిళా లాయర్పై సమాజ్వాదీ నేత అత్యాచారం..
- బ్లాక్మెయిల్ చేస్తూ ఏడాదిగా అఘాయిత్యం..
- ఫిర్యాదు నమోదు.. పరారీలో ఉన్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: ఉత్తర్ ప్రదేశ్లో వరసగా సమాజ్వాదీ(ఎస్పీ) నేతలు అత్యాచారం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఎస్పీకి చెందిన సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్ బహదూర్ పాల్ ఓ మహిళా లాయర్పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు లాయర్ అతడి దగ్గర సహయకురాలిగా పనిచేసేది. ఈ ఆరోపణలతో వీరేందర్ పాల్ పాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిని పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. మౌ బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్గా రెండుసార్లు పనిచేసిన వీరేందర్పై బాధితురాలు ఫిర్యాదు చేశారు.
Read Also: Ram Nagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. “రామ్ నగర్ బన్నీ” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్..
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
తన వీడియోలు, ఫోటోలు ఉపయోగించి బ్లాక్మెయిల్ చేస్తూ ఏడాదిగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళా లాయర్ ఆరోపించింది. అతను తనను పదేపదే బెదిరించాడని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఫిర్యాదు నమోదు కావడంతో వీరేందర్ పరారీలో ఉన్నారు. పరీక్షల నిమిత్తం మహిళను వైద్య పరీక్షలకు పంపించారు. కోర్టు పరిసరాల్లో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య భౌతిక దాడి జరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
మౌ సిటీ సర్కిల్ ఆఫీసర్ (CO) అంజనీ కుమార్ పాండే మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్ 07న బాధితురాలు తాను దుర్కొన్న లైంగిక వేధింపులు, శారీరక హింస మరియు బెదిరింపులను సంబంధించి ఫిర్యాదును నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, తగిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని చెప్పారు. వీరేందర్ పాల్ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది మాత్రమే కాకుండా, ప్రముఖ ఎస్పీ నేత. ఇతడి తండ్రి దయారామ్ పాల్ బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. ప్రస్తుతం ఇతను ఉత్తరాఖండ్ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే, ఎస్పీ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఎస్సీ నేత నవాబ్ సింగ్ యాదవ్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఇతను అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్కి మాజీ సహాయకుడిగా ఉన్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!