Sambhal Violence: సంభాల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ ఎంపీతో పాటు ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు
- యూపీలోని సంభాల్ లో జామా మసీదు వద్ద సర్వే సమయంలో ఉద్రిక్తత..
- సమాజ్ వాది ఎంపీతో పాటు ఎమ్మెల్యే కొడుకుపై పోలీస్ కేసు నమోదు..
- బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ కృష్ణ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆదివారం ఉదయం వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడికి దిగారు.
Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా..
Also Read
- Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి 'ది ఎండ్'?
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
అయితే, ఈ దాడిలో పలువురు అధికారులతో పాటు 20 మంది పోలీసులు గాయపడగా.. ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్ప వాయువును పోలీసులు ప్రయోగించడంతో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో ఆదివారం ముగ్గురు మరణించగా.. సోమవారం మరొకరు చనిపోయారు. అయితే, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ పిలుపుతోనే ఈ హింస నెలకొందని జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ వెల్లడించారు.
Read Also: Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
ఇక, బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారి కృష్ణ కుమార్ తెలిపారు. హింస జరిగినపుడు ఎస్పీ ఎంపీ బార్క్.. బెంగళూరులో ఉన్నారని మీడియా ప్రశ్నించగా.. అంతకు ముందే ఎంపీ ఇచ్చిన పిలుపుతోనే ఈ దారుణం జరిగిందన్నారు. కాగా, హింస చెలరేగడంతో సోమవారం సంభాల్ లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ఇచ్చారు. 24 గంటల పాటు ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసింది. ఈనెల 30 వరకు బయటివారు సంభాల్ లో ప్రవేశించకుండా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్ను కలవనున్న విజయ్
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
-
Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!