Sambhal Violence: సంభాల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ ఎంపీతో పాటు ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు
- యూపీలోని సంభాల్ లో జామా మసీదు వద్ద సర్వే సమయంలో ఉద్రిక్తత..
- సమాజ్ వాది ఎంపీతో పాటు ఎమ్మెల్యే కొడుకుపై పోలీస్ కేసు నమోదు..
- బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ కృష్ణ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆదివారం ఉదయం వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడికి దిగారు.
Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా..
Also Read
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Siddaramaiah: సిద్ధరామయ్య రాజీనామాపై ఉత్కంఠ! హాట్ టాఫిక్గా ఓ సీనియర్ నేత వ్యాఖ్యలు
- Modi-CM Vijay: మోడీతో సీఎం విజయ్ భేటీ.. 20 నిమిషాలు కీలక చర్చలు
- ఎన్నికల్లో పోటీ చేయబోతున్న 'Cockroach Janata Party'.. ఈసీకి అప్లికేషన్! అప్లై చేసింది ఎవరో తెలుసా?
అయితే, ఈ దాడిలో పలువురు అధికారులతో పాటు 20 మంది పోలీసులు గాయపడగా.. ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్ప వాయువును పోలీసులు ప్రయోగించడంతో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో ఆదివారం ముగ్గురు మరణించగా.. సోమవారం మరొకరు చనిపోయారు. అయితే, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ పిలుపుతోనే ఈ హింస నెలకొందని జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ వెల్లడించారు.
Read Also: Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
ఇక, బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారి కృష్ణ కుమార్ తెలిపారు. హింస జరిగినపుడు ఎస్పీ ఎంపీ బార్క్.. బెంగళూరులో ఉన్నారని మీడియా ప్రశ్నించగా.. అంతకు ముందే ఎంపీ ఇచ్చిన పిలుపుతోనే ఈ దారుణం జరిగిందన్నారు. కాగా, హింస చెలరేగడంతో సోమవారం సంభాల్ లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ఇచ్చారు. 24 గంటల పాటు ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసింది. ఈనెల 30 వరకు బయటివారు సంభాల్ లో ప్రవేశించకుండా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!