Sambhal Violence: సంభాల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ ఎంపీతో పాటు ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు
- యూపీలోని సంభాల్ లో జామా మసీదు వద్ద సర్వే సమయంలో ఉద్రిక్తత..
- సమాజ్ వాది ఎంపీతో పాటు ఎమ్మెల్యే కొడుకుపై పోలీస్ కేసు నమోదు..
- బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ కృష్ణ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆదివారం ఉదయం వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడికి దిగారు.
Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
అయితే, ఈ దాడిలో పలువురు అధికారులతో పాటు 20 మంది పోలీసులు గాయపడగా.. ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్ప వాయువును పోలీసులు ప్రయోగించడంతో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో ఆదివారం ముగ్గురు మరణించగా.. సోమవారం మరొకరు చనిపోయారు. అయితే, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ పిలుపుతోనే ఈ హింస నెలకొందని జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ వెల్లడించారు.
Read Also: Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
ఇక, బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారి కృష్ణ కుమార్ తెలిపారు. హింస జరిగినపుడు ఎస్పీ ఎంపీ బార్క్.. బెంగళూరులో ఉన్నారని మీడియా ప్రశ్నించగా.. అంతకు ముందే ఎంపీ ఇచ్చిన పిలుపుతోనే ఈ దారుణం జరిగిందన్నారు. కాగా, హింస చెలరేగడంతో సోమవారం సంభాల్ లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ఇచ్చారు. 24 గంటల పాటు ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసింది. ఈనెల 30 వరకు బయటివారు సంభాల్ లో ప్రవేశించకుండా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!