Sambhal Violence: సంభాల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఎస్పీ ఎంపీతో పాటు ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు
- యూపీలోని సంభాల్ లో జామా మసీదు వద్ద సర్వే సమయంలో ఉద్రిక్తత..
- సమాజ్ వాది ఎంపీతో పాటు ఎమ్మెల్యే కొడుకుపై పోలీస్ కేసు నమోదు..
- బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ కృష్ణ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sambhal Violence: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో జామా మసీదు దగ్గర సర్వే సమయంలో చెలరేగిన హింస కేసులో పోలీసులు 400 మందిపై కేసు ఫైల్ చేశారు. నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ తో పాటు ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కొడుకు సోహైల్ కూడా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో మసీదు ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆదివారం ఉదయం వెళ్లిన బృందంపై స్థానిక ముస్లింలు రాళ్లతో దాడికి దిగారు.
Read Also: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా..
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
అయితే, ఈ దాడిలో పలువురు అధికారులతో పాటు 20 మంది పోలీసులు గాయపడగా.. ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలకు నిప్పుపెట్టారు నిరసనకారులు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్ప వాయువును పోలీసులు ప్రయోగించడంతో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో ఆదివారం ముగ్గురు మరణించగా.. సోమవారం మరొకరు చనిపోయారు. అయితే, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్ పిలుపుతోనే ఈ హింస నెలకొందని జిల్లా ఎస్పీ కృష్ణ కుమార్ వెల్లడించారు.
Read Also: Maharashtra: మహరాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ..
ఇక, బాధ్యులపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ అధికారి కృష్ణ కుమార్ తెలిపారు. హింస జరిగినపుడు ఎస్పీ ఎంపీ బార్క్.. బెంగళూరులో ఉన్నారని మీడియా ప్రశ్నించగా.. అంతకు ముందే ఎంపీ ఇచ్చిన పిలుపుతోనే ఈ దారుణం జరిగిందన్నారు. కాగా, హింస చెలరేగడంతో సోమవారం సంభాల్ లో విద్యా సంస్థలకు అధికారులు సెలవు ఇచ్చారు. 24 గంటల పాటు ఇంటర్ నెట్ సర్వీసులను నిలిపివేసింది. ఈనెల 30 వరకు బయటివారు సంభాల్ లో ప్రవేశించకుండా పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!