Sadhguru Vasudev: దయచేసి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపేయండి..!

  • బంగ్లాదేశ్ లో హిందువులపై పెరిగిన దాడులు..
  • కేంద్రం బంగ్లాలోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి..
  • మైనారిటీ వర్గాల ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలవాలి: సద్గురు వాసుదేవ్
Sadguru

Sadguru

Sadhguru Vasudev: బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయింది. తాజాగా.. బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సద్గురు వాసుదేవ్‌ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. బంగ్లాలోని హిందువులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ విజ్జప్తి చేశారు.

Read Also: Vinesh Phogat Hospitalised: వినేశ్‌ ఫొగాట్‌కు తీవ్ర అస్వస్థత.. పారిస్‌లోని ఆస్పత్రికి తరలింపు!

ఈ క్రమంలో జగ్గీ వాసుదేవ్ ఎక్స్ (X) వేదికగా మాట్లాడూతూ.. బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని చెప్పుకొచ్చారు. మన పక్క దేశాలలో నివసిస్తున్న మైనారిటీ ప్రజల భద్రత కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టేలా కృషి చేయాలని కోరారు. మైనారిటీ వర్గాల ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలవాలి.. అలా నిలవని పక్షంలో భారత్ ఎప్పుడు అఖండ భారత్ కాదని సద్గురు వాసుదేవ్ సృష్టం చేశారు. దురదృష్టవశాత్తూ ఈ దేశంలో భాగమైన ప్రాంతం, మన పొరుగు దేశంగా మారిపోయింది.. అయితే, ఈ దురాగతాల నుంచి మన నాగరికతకు చెందిన వారిని సేవ్ చేయడం మన బాధ్యతని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్ పేర్కొన్నారు.