DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియాగాంధీ చేశారు.. కాంగ్రెస్తోనే దేశం ఐక్యంగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని ఆయన మంగళవారం అన్నారు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 2004లో సోనియాగాంధీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు.
యూపీఏతో సంబంధం లేకుండా ఎంపీలంతా ఆమెను ప్రధాని చేయాలని కోరారని, అయితే ఆమె మన్మోహన్ సింగ్ని ప్రధాని చేసిందని, యూపీఏ మొత్తం ఆమె ప్రధాని కావాలని కోరుకున్నప్పటికీ, ఒక ఆర్థికవేత్త కోసం త్యాగం చేశారని అన్నారు. ఒక మహిళ ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకుని దేశం కోసం మన్మోహన్ సింగ్ని నామినేట్ చేశారని, అది దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగమని, అది గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగమని డీకే శివకుమార్ అన్నారు.
Also Read
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
Read Also: Kerala BJP: “మతం పేరుతో ప్రచారం”.. కేరళ సీఎంపై ఈసీకి బీజేపీ లేఖ..
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ఇలాంటి త్యాగం చేస్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. పార్లమెంట్ సభ్యులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడుతున్నారని, అతను నడిచినంత దూరం దేశంలో ఏ నేత నడవలేదని కొనియాడారు. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధానిగా రాహుల్ గాంధీ కావచ్చు, కానీ ఆయన ఎప్పుడూ అధికారం వైపు చూడలేదని, పార్టీ అధికారంలో ఉండాలని కోరుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబం మాత్రమే ఐక్యంగా ఉంచగలదని, కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందని, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అతిపెద్ద బలమని, ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచిందని ఆయన అన్నారు.
2004లో ‘ఇండియా షైనింగ్’ అనే నినాదంతో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు రాగా.. కాంగ్రెస్ 145, సీపీఎం 43, ఎస్పీ 43, ఆర్జేడీ 24 సీట్లను గెలుచుకున్నారు. యూపీఏ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. 2009లో మరోసారి యూపీఏ అదికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగబోతున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?