Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమళ ఆలయం.. పోటెత్తిన భక్తులు
Sabarimala Temple: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మండల పూజల అనంతరం మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం మళ్లీ తెరుచుకుంది. మకరవిళక్కు మకరజ్యోతి ఉత్సవాల కోసం శబరిమల తెరిచారు అధికారులు. ఈ నెల 27వ తేదీ రాత్రి మూసివేసిన అయ్యప్ప ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన అర్చకుడు కందారు మహేశ్ మోహనరావు శనివారం సాయంత్రం తెరిచారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రధాన అర్చకుడు పిఎన్ మహేష్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు. జనవరి 13న ప్రసాద శుద్ధ క్రియ.. 14న బింబ శుద్ధ క్రియ నిర్వహించనున్నట్లు శబరిమల ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. జనవరి 15న మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అయితే మకరజ్యోతి పూర్తయిన తర్వాత కూడా జనవరి 20 వరకు శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆలయాన్ని తెరిచి ఉంచనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. 41 రోజులుగా జరుగుతున్న మండల పూజల సందర్భంగా శబరిమలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Read also: Hyderabad Metro: న్యూ ఇయర్ ఆఫర్.. నేడు ఒంటిగంట వరకు మెట్రో సేవలు
Also Read
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో భక్తుల రద్దీని అదుపు చేయలేక కేరళ పోలీసులు ఒక దశలో లాఠీచార్జి కూడా చేశారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా 41 రోజుల మండల పూజల సీజన్కు భక్తులు పోటెత్తడంతో మకరజ్యోతి సందర్భంగా వర్చువల్ క్యూ లైన్ల టిక్కెట్ల జారీకి సంబంధించి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతికి భక్తుల రద్దీని నివారించేందుకు జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్లను 50 వేలకు తగ్గిస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీసీ ప్రశాంత్ తెలిపారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు బుకింగ్లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్లను 10,000కు పరిమితం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ రెండు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా పంబకు వెళ్లే బదులు నిలక్కల్లో స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. 41 రోజుల్లో 241.71 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
Top Headlines@ 9AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
-
Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
-
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
-
Peddi : పెద్ది ఐటం సాంగ్.. చరణ్ – శృతి హాసన్ డాన్స్ వీడియో లీక్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!