Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమళ ఆలయం.. పోటెత్తిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabarimala Temple: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మండల పూజల అనంతరం మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం మళ్లీ తెరుచుకుంది. మకరవిళక్కు మకరజ్యోతి ఉత్సవాల కోసం శబరిమల తెరిచారు అధికారులు. ఈ నెల 27వ తేదీ రాత్రి మూసివేసిన అయ్యప్ప ఆలయ ద్వారాలను ఆలయ ప్రధాన అర్చకుడు కందారు మహేశ్ మోహనరావు శనివారం సాయంత్రం తెరిచారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రధాన అర్చకుడు పిఎన్ మహేష్ నంబూద్రి ఆలయ ద్వారాలను తెరిచారు. జనవరి 13న ప్రసాద శుద్ధ క్రియ.. 14న బింబ శుద్ధ క్రియ నిర్వహించనున్నట్లు శబరిమల ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. జనవరి 15న మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అయితే మకరజ్యోతి పూర్తయిన తర్వాత కూడా జనవరి 20 వరకు శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆలయాన్ని తెరిచి ఉంచనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. 41 రోజులుగా జరుగుతున్న మండల పూజల సందర్భంగా శబరిమలకు భక్తులు భారీగా తరలివచ్చారు.
Read also: Hyderabad Metro: న్యూ ఇయర్ ఆఫర్.. నేడు ఒంటిగంట వరకు మెట్రో సేవలు
Also Read
- Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో భక్తుల రద్దీని అదుపు చేయలేక కేరళ పోలీసులు ఒక దశలో లాఠీచార్జి కూడా చేశారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా 41 రోజుల మండల పూజల సీజన్కు భక్తులు పోటెత్తడంతో మకరజ్యోతి సందర్భంగా వర్చువల్ క్యూ లైన్ల టిక్కెట్ల జారీకి సంబంధించి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మకరజ్యోతికి భక్తుల రద్దీని నివారించేందుకు జనవరి 14, 15 తేదీల్లో వర్చువల్ క్యూ బుకింగ్లను 50 వేలకు తగ్గిస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీసీ ప్రశాంత్ తెలిపారు. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు బుకింగ్లు లేకుండా ఈ రెండు రోజుల్లో స్పాట్ బుకింగ్లను 10,000కు పరిమితం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ రెండు రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా పంబకు వెళ్లే బదులు నిలక్కల్లో స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. 41 రోజుల్లో 241.71 కోట్ల ఆదాయం వచ్చిందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.
Top Headlines@ 9AM: టాప్ న్యూస్!
తాజావార్తలు
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!