Gokarna: మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ.. ఏమైందంటే..
- మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ..
- ఆధ్యాత్మిక ధ్యానం కోసం ఉన్నట్లు వెల్లడి..
- రక్షించిన గోకర్ణ పోలీసులు, రష్యాకు పంపే ప్రయత్నం..
Gokarna: కర్ణాటకలోని గోకర్ణలోని రామతీర్థ కొండపై ఉన్న మారుమూల మరియు ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలను పోలీసులు రక్షించారు. గోకర్ణ పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో, అడవిలో ఒక తాత్కాలిక నివాసంలో ఈ ముగ్గురిని కనుగొన్నారు. జూలై 9న గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఆర్ తన బృందంతో పర్యాటకుల భద్రత కోసం గస్తీ తిరుగుతున్న సమయంలో రామ తీర్థ కొండ ప్రాంతంలో, అడవిలోని ఒక గుహ వద్ద వీరు కనిపించారు.
Read Also: Gudivada: గుడివాడలో బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ ప్రోగ్రాం.. సమావేశానికి కొడాలి నాని దూరం
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
దర్యాప్తులో మహిళను రష్యాకు చెందిన 40 ఏళ్ల నీనా కుటినాగా గుర్తించారు. ఆమె ఇద్దరు కుమార్తెలు 6, 4 ఏళ్ల ప్రేమ, ఆమాగా గుర్తించారు. వీరంతా కలిసి గుహ లోపల నివసిస్తున్నట్లు కనుగొన్నారు. విచారణలో, గోవా నుంచి గోకర్ణకు ఆధ్యాత్మక ఏకాంతం కోసం వచ్చినట్లు నీనా చెప్పారు. ధ్యానం, ప్రార్థనల్లో పాల్గొనేందుకు అటవీ గుహలో ఉన్నట్లు చెప్పింది. అయితే, ఆమె ఉద్దేశాలు ఆధ్యాత్మికమైనప్పటికీ, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం, చిన్న పిల్లలు ఉండటంతో పోలీసులు వారిని రెస్క్యూ చేశారు. కౌన్సిలింగ్ తర్వాత, ఆ మహిళ అభ్యర్థన మేరకు, ఆమెను కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు.
గోకర్ణ పోలీసులు, అటవీ అధికారులు వీరి వీసా పత్రాలను గుహలోనే గుర్తించారు. నీనా మొదట ఏప్రిల్ 17, 2017 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించిందని తేలింది. ఏప్రిల్ 19, 2018న గోవాలోని FRRO పనాజీ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది. ఆమె తరువాత నేపాల్కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న తిరిగి భారతదేశంలోకి ప్రవేశించిందని రికార్డులు చూపించాయి. ఆమె కాలపరిమితికి మించి భారత్లో ఉంటుంనందున, రష్యాకు పంపిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?