Gokarna: మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ.. ఏమైందంటే..
- మారుమూల గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ..
- ఆధ్యాత్మిక ధ్యానం కోసం ఉన్నట్లు వెల్లడి..
- రక్షించిన గోకర్ణ పోలీసులు, రష్యాకు పంపే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gokarna: కర్ణాటకలోని గోకర్ణలోని రామతీర్థ కొండపై ఉన్న మారుమూల మరియు ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలను పోలీసులు రక్షించారు. గోకర్ణ పోలీసులు గస్తీ తిరుగుతున్న సమయంలో, అడవిలో ఒక తాత్కాలిక నివాసంలో ఈ ముగ్గురిని కనుగొన్నారు. జూలై 9న గోకర్ణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఆర్ తన బృందంతో పర్యాటకుల భద్రత కోసం గస్తీ తిరుగుతున్న సమయంలో రామ తీర్థ కొండ ప్రాంతంలో, అడవిలోని ఒక గుహ వద్ద వీరు కనిపించారు.
Read Also: Gudivada: గుడివాడలో బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ ప్రోగ్రాం.. సమావేశానికి కొడాలి నాని దూరం
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
దర్యాప్తులో మహిళను రష్యాకు చెందిన 40 ఏళ్ల నీనా కుటినాగా గుర్తించారు. ఆమె ఇద్దరు కుమార్తెలు 6, 4 ఏళ్ల ప్రేమ, ఆమాగా గుర్తించారు. వీరంతా కలిసి గుహ లోపల నివసిస్తున్నట్లు కనుగొన్నారు. విచారణలో, గోవా నుంచి గోకర్ణకు ఆధ్యాత్మక ఏకాంతం కోసం వచ్చినట్లు నీనా చెప్పారు. ధ్యానం, ప్రార్థనల్లో పాల్గొనేందుకు అటవీ గుహలో ఉన్నట్లు చెప్పింది. అయితే, ఆమె ఉద్దేశాలు ఆధ్యాత్మికమైనప్పటికీ, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటం, చిన్న పిల్లలు ఉండటంతో పోలీసులు వారిని రెస్క్యూ చేశారు. కౌన్సిలింగ్ తర్వాత, ఆ మహిళ అభ్యర్థన మేరకు, ఆమెను కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసి స్వామి యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు.
గోకర్ణ పోలీసులు, అటవీ అధికారులు వీరి వీసా పత్రాలను గుహలోనే గుర్తించారు. నీనా మొదట ఏప్రిల్ 17, 2017 వరకు చెల్లుబాటు అయ్యే బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించిందని తేలింది. ఏప్రిల్ 19, 2018న గోవాలోని FRRO పనాజీ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడింది. ఆమె తరువాత నేపాల్కు వెళ్లి సెప్టెంబర్ 8, 2018న తిరిగి భారతదేశంలోకి ప్రవేశించిందని రికార్డులు చూపించాయి. ఆమె కాలపరిమితికి మించి భారత్లో ఉంటుంనందున, రష్యాకు పంపిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!