ఆర్ఎస్ఎస్కు అధికారం అక్కర్లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మీరట్లోని శతాబ్ది నగర్లోని మాధవ్ కుంజ్లో విదేశాల నుంచి వచ్చిన 950 మంది అథ్లెట్లను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. సంఘ్ లక్ష్యం రాజకీయ అధికారం పొందడం కాదని.. మొత్తం హిందూ సమాజాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ‘‘హిందూ’’ అనే పదం కులం కాదని.. భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందన్నారు. ఆరాధనా పద్ధతులు, దేవతలు భిన్నంగా ఉండవచ్చు కానీ మన సాంస్కృతిక పునాది మాత్రం ఐక్యత, సామరస్యం మీద ఉన్నాయన్నారు. సామాజిక ఐక్యత బలహీనపడినప్పుడల్లా దేశం సంక్షోభాలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: ఓ వైపు కోర్టు మొట్టికాయలు.. ఇంకోవైపు ట్రంప్ దూకుడు.. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ విధింపు
దేశం కేవలం భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాకూడదన్నారు. భారతదేశ ఆత్మ శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, స్వామి వివేకానంద, స్వామి దయానంద, మహాత్మా గాంధీ సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతుందని చెప్పారు. ఇక దేశ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఒక విషయం ఏంటంటే.. సంఘ్ ఏ సమూహానికి వ్యతిరేకంగా లేదా పోటీగా పనిచేయదన్నారు. కానీ సామాజిక ఐక్యతను బలోపేతం చేయడానికి మాత్రం కట్టుబడి ఉన్నామని.. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణాన్ని బలోపేతం చేయడమేనని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Shahid Afridi: భారత్పై గెలిచే దమ్ము లేదు.. నమీబియాపై గెలిచి ఇంత బిల్డప్ అవసరమా..
సంఘ్ లక్ష్యం స్వంత ఖ్యాతిని పెంచుకోవడం కాదని.. దేశ ఖ్యాతిని పెంచడమేనన్నారు. సమాజం నాలుగు స్తంభాలపై ఉందన్నారు. సంస్కారం (సంస్కృతి), శాశ్వత సంస్కృతి, మతపరమైన భావాలు, నిజాయితీతో ఉన్నాయన్నారు. వ్యక్తిగత అభివృద్ధి ద్వారా మొత్తం హిందూ సమాజాన్ని ఏకం చేయడమే RSS లక్ష్యం అని పేర్కొన్నారు. స్వచ్ఛంద సేవకులు వివిధ సామాజిక రంగాల్లో చురుకుగా ఉంటారని.. అలాగే జాతీయ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమైనవిగా భావిస్తారన్నారు.