PM Modi: ప్రధాని మోడీ నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
- ప్రధానిని ఆయన నివాసంలో కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్..
- సమావేశంలో పాల్గొన్న అమిత్ షా..
- ఢిల్లీలో వేగంగా మారుతున్న పరిణామాలు..
- పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం కోసం రగిలిపోతున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ప్రధాని మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. టైమ్, టార్గెట్, ప్లేస్ అంతా సైన్యానికే వదిలిపెట్టారు. ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఆయన సైన్యంపై పూర్తి నమ్మకం ఉంచుతున్నట్లు చెప్పారు.
ఈ సమావేశం తర్వాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలోని 7, లోక్ లక్యాన్ మార్గ్లోని ప్రధాని మోడీ నివాసంలో ఆయనను కలిసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. వరసగా భేటీలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మరోవైపు పాకిస్తాన్ గుండెల్లో వణుకుపుట్టిస్తున్నాయి.
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Read Also: Nabha Natesh : వాళ్లను క్షమించకూడదు.. పహల్గాం దాడిపై నభానటేష్..
26 మందిని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీస్పందన తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరిమిత మిలిటరీ యాక్షన్ ఉంటుందా..?, యుద్ధం తరహా పరిస్థితులు ఉంటాయా..? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరసగా ఢిల్లీలోని పరిణామాల బట్టి చూస్తే ఏదో పెద్దగా జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే, ఈ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం కోసం చూస్తోంది.
భారత్ ఇప్పటికే పాకిస్తాన్కి తన దౌత్య దెబ్బ రుచి చూపిస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. సింధు నదిపైనే 80 శాతం పాక్ జనాభా ఆధారపడి ఉంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ దేశానికి సింధు జలాలే దిక్కు. ఇక పాకిస్తానీయులకు వీసాలు రద్దు చేసింది. అట్టారీ వాఘా బోర్డర్ని క్లోజ్ చేస్తున్నట్టు తెలిపింది.
తాజావార్తలు
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!