Mohan Bhagwat: సింధీ క్యాంప్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- సింధీ క్యాంప్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- ఎక్కడున్నా మనమంతా హిందువులమేనని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది సింధీలు పాకిస్థాన్కు వెళ్లలేదని.. మనమంతా అవిభక్త భారతదేశం అని గుర్తించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ రోజు మనం మనల్ని మనం భిన్నంగా పిలుచుకుంటాం.. కానీ మనం ఏ మతం లేదా భాషతో అనుబంధం కలిగి ఉన్నా.. నిజం ఏమిటంటే మనమందరం ఒకటే.. మనమంతా హిందువులమే.’’ అని వ్యా్ఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Gurugram: గురుగ్రామ్లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్రేప్
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
‘‘చాలా మంది సింధీ సోదరులు ఇక్కడ కూర్చున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారు పాకిస్థాన్కు వెళ్లలేదు. వారు అవిభక్త భారతదేశంలో ఉన్నారు. పరిస్థితులు ఆ ఇంటి నుంచి ఇక్కడికి పంపాయి. ఎందుకంటే ఆ ఇల్లు-ఈ ఇల్లు భిన్నంగా లేవు. భారతదేశం మొత్తం అంతా ఒకే ఇల్లు. కానీ ఎవరో మన ఇంటిలోని వస్తువులు దొంగిలించారు. వారు దానిని ఆక్రమించారు. రేపు దానిని మనం తిరిగి తీసుకోవాలి. అందువల్ల మనం అవిభక్త భారతదేశం అని గుర్తుంచుకోవాలి.’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: నా ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయి.. డార్జిలింగ్ విషాదంపై మోడీ ఆవేదన
‘‘తెలివైన బ్రిటీషర్లు మనతో పోరాడి పాలించారు. మన ఆధ్యాత్మిక మనస్సాక్షిని లాక్కొని మనకు భౌతికమైన వస్తువులను ఇచ్చారు. అప్పటి నుంచి ఒకరికొకరు భిన్నంగా భావించాం. కొన్నిసార్లు తమను తాము హిందువులుగా భావించని వ్యక్తులు విదేశాలకు వెళతారు. అయినప్పటికీ ప్రపంచం వారిని హిందువులుగానే పిలుస్తుంది. ఇది వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే వారు అలా గుర్తించబడకుండా ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కానీ నిజం ఏమిటంటే వారు హిందువులే.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
#WATCH | Satna, MP | RSS Chief Mohan Bhagwat says, "Many Sindhi brothers are sitting here. I am very happy. They did not go to Pakistan; they went to undivided India….Circumstances have sent us here from that home because that home and this home are not different. The whole of… pic.twitter.com/CdNaLdzwQc
— ANI (@ANI) October 5, 2025
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!