Mohan Bhagwat: సింధీ క్యాంప్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- సింధీ క్యాంప్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- ఎక్కడున్నా మనమంతా హిందువులమేనని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది సింధీలు పాకిస్థాన్కు వెళ్లలేదని.. మనమంతా అవిభక్త భారతదేశం అని గుర్తించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ రోజు మనం మనల్ని మనం భిన్నంగా పిలుచుకుంటాం.. కానీ మనం ఏ మతం లేదా భాషతో అనుబంధం కలిగి ఉన్నా.. నిజం ఏమిటంటే మనమందరం ఒకటే.. మనమంతా హిందువులమే.’’ అని వ్యా్ఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Gurugram: గురుగ్రామ్లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్రేప్
Also Read
- New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
‘‘చాలా మంది సింధీ సోదరులు ఇక్కడ కూర్చున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారు పాకిస్థాన్కు వెళ్లలేదు. వారు అవిభక్త భారతదేశంలో ఉన్నారు. పరిస్థితులు ఆ ఇంటి నుంచి ఇక్కడికి పంపాయి. ఎందుకంటే ఆ ఇల్లు-ఈ ఇల్లు భిన్నంగా లేవు. భారతదేశం మొత్తం అంతా ఒకే ఇల్లు. కానీ ఎవరో మన ఇంటిలోని వస్తువులు దొంగిలించారు. వారు దానిని ఆక్రమించారు. రేపు దానిని మనం తిరిగి తీసుకోవాలి. అందువల్ల మనం అవిభక్త భారతదేశం అని గుర్తుంచుకోవాలి.’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: నా ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయి.. డార్జిలింగ్ విషాదంపై మోడీ ఆవేదన
‘‘తెలివైన బ్రిటీషర్లు మనతో పోరాడి పాలించారు. మన ఆధ్యాత్మిక మనస్సాక్షిని లాక్కొని మనకు భౌతికమైన వస్తువులను ఇచ్చారు. అప్పటి నుంచి ఒకరికొకరు భిన్నంగా భావించాం. కొన్నిసార్లు తమను తాము హిందువులుగా భావించని వ్యక్తులు విదేశాలకు వెళతారు. అయినప్పటికీ ప్రపంచం వారిని హిందువులుగానే పిలుస్తుంది. ఇది వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే వారు అలా గుర్తించబడకుండా ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కానీ నిజం ఏమిటంటే వారు హిందువులే.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
#WATCH | Satna, MP | RSS Chief Mohan Bhagwat says, "Many Sindhi brothers are sitting here. I am very happy. They did not go to Pakistan; they went to undivided India….Circumstances have sent us here from that home because that home and this home are not different. The whole of… pic.twitter.com/CdNaLdzwQc
— ANI (@ANI) October 5, 2025
తాజావార్తలు
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్లకు కీలక పరీక్ష..
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!