Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!
- బీహార్లో విచిత్రమైన పరిస్థితి
- బీహార్లో పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ
- తిరిగి రాబట్టేందుకు అధికారులు తంటాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులు ఒకరికి వేస్తే.. ఇంకొకరికి బదిలీ అయ్యాయి. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వాటిని తీసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. అసలేం జరిగింది. డబ్బుల గొడవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
Also Read
- Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం... మోడీ లెక్క ఇదే!
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్డీఏ కూటమి మహిళలకు డబ్బులు బదిలీ చేసింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల ఖాతాలకు నగదు పంపించింది. డబ్బులు అందుకున్న మహిళలంతా సంతోషంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. మహిళలకు వేయడం వరకు బాగానే ఉంది. కానీ వాళ్లతో పాటు పురుషుల ఖాతాల్లో కూడా నగదు జమ కావడం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తిరిగి వారి దగ్గర నుంచి రాబట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్పై మమతను ప్రశ్నించిన బీజేపీ
సాంకేతిక లోపం కారణంగా దర్భంగా జిల్లాలో పలువురి పురుషుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ అయినట్లుగా అధికారులు గుర్తించారు. పొరపాటును గుర్తించిన అధికారులు తిరిగి తీసుకునేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ డబ్బుతో ఇంటికి అవసరం అయిన వస్తువులు కొనుగోలు చేసేశామని.. తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. వాటిని వదిలేసుకోవాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను గ్రామస్తులు కోరుతున్నారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టించింది. ఏకంగా ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలుచుకుంది. విపక్ష కూటమి చతికిలపడింది. గతంలో కంటే దిగజారిపోయింది.
తాజావార్తలు
-
Telangana Govt: పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు.. టీచర్ల సర్దుబాటుపై కలెక్టర్లకు పూర్తి అధికారం!
-
Welcome To The Jungle : బికినీ సీన్లకు సెన్సార్ బ్రేక్… ‘వెల్కమ్ టు ది జంగిల్’ రిలీజ్కు ముందే 18 కత్తెరలు..
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
-
Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!