Amit Shah: రోహింగ్యా, బంగ్లాదేశీయులే టార్గెట్.. ఢిల్లీపై అమిత్ షా సమీక్ష..
- అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలే టార్గెట్..
- ఢిల్లీ శాంతిభద్రలపై అమిత్ షా కీలక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఢిల్లీలో అక్రమ బంగ్లాదేశీయలు, రోహింగ్యాలే టార్గెట్గా శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలు, అభివృద్ధి అంశాలపై ఆయన సమావేశం నిర్వహించారు. సమీక్షకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం శాఖ మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ హాజరయ్యారు. ఢిల్లీని సేఫ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అమిత్ షా ఆదేశించారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహా అనధికార వలసదారులతో వ్యవహరించేటప్పుడు స్పష్టమైన, వేగవంతమైన చట్టపరమైన విధానాన్ని కలిగి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేసింది, డబల్ స్పీడ్తో ఢిల్లీనీ అభివృద్ధి చెయ్యాలని ఆయన ఆదేశించారు. జాతీయ భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని అక్రమ చొరబాటు దారులకు సాయం చేసే నెట్వర్క్లపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. పోలీసుల పనితీరుపై సమీక్ష నిరంతరం కొనసాగాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర ముఠాలు, డ్రగ్స్ నెట్వర్క్పై సీరియస్ యాక్షన్ అమలు చేయాలని కోరారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Tamil Nadu: సింగిల్ నిమ్మకాయకు రూ. 13,000.. శివరాత్రి వేలంలో రికార్డ్ ధర..
ఢిల్లీలో నిర్మాణాల కోసం పోలీసుల అనుమతి అవసరం లేదని, ఈ రూల్ తొలగించాలని అమిత్ షా సూచించారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులను త్వరగా పరిష్కరించాలని స్పెషల్ ప్రాసిక్యూటర్లను నియమించాలని ఆదేశించారు. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టులకు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లలో పబ్లిక్ హియరింగ్లు నిర్వహించాలి, అందుకోసం ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఢిల్లీలో మహిళలు పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ట్రాఫిక్ జామ్లకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కోరారు. రానున్న వర్షాకాలానికి సంబంధించి ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..