Nitin Gadkari: భారత్లోనే రోడ్డు ప్రమాదాలు అధికంగా ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై బుధవారం రాజ్యసభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యూఆర్ఎస్) 2018 ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మరోవైపు రోడ్డుప్రమాదాల్లో క్షతగాత్రుల విషయంలో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2020 సంవత్సరానికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం 69.80 శాతంగా ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
మరోవైపు రోడ్ల అభివృద్ధిపై రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ.. దేశంలో మొత్తం 22 గ్రీన్ఫీల్డ్ హైవేలను రూ. 1,63,350 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అటు 2,485 కి.మీ పొడవుతో కూడిన 5 ఎక్స్ప్రెస్వేలతో పాటు 5,816 కి.మీ పొడవుతో కూడిన 17 యాక్సెస్-నియంత్రిత హైవేలను రూ. 1,92,876 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఛాసిస్ నంబర్ ఆధారంగా వాహన వినియోగదారులకు ఫాస్ట్ట్యాగ్ జారీ చేయబడుతుందని గడ్కరీ వివరించారు. మార్చి 30, 2022 నాటికి, వివిధ బ్యాంకులు జారీ చేసిన మొత్తం ఫాస్ట్ట్యాగ్ల సంఖ్య 4,95,20,949గా, జాతీయ రహదారులపై ఉన్న ఫీజు ప్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ వ్యాప్తి దాదాపు 96.5 శాతంగా ఉందని గడ్కరీ పేర్కొన్నారు.
Also Read
- Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
- El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
- PM Modi: కిర్గిజ్స్థాన్లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
తాజావార్తలు
-
AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Mallu Ravi : కొండా సురేఖ వ్యవహారంపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
-
Rupee: సంక్షోభం సమయంలో ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. భారీగా పుంజుకున్న రూపాయి విలువ
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!