Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
- డేటా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు దేశంలో నకిలీ నోట్లు ఎక్కువవుతోంది. ఎక్కువగా 500రూపాయల నోటే ఎక్కువగా చెలామణిలో ఉందని ఆర్బీఐ గుర్తించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నుండి నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు 2024–25లో 1,17,722 కి పెరిగింది , 2023–24లో 85,711, 2022–23లో 91,110తో పోలిస్తే ఇది పెరిగింది.
Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ
Also Read
- Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
- Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
- Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
- Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ సిరీస్ రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య 1,17,722 కు పెరిగింది. గత సంవత్సరాల్లో గుర్తించిన సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 91,110 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 85,711 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి.
Read Also:Wedding-Fraud: పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి మహిళ.. నిందితుల అరెస్ట్
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో అత్యంత ఎక్కువగా చెలామణి అవుతున్న నోట్లలో ఎక్కువగా 500రూపాయల నోట్లే ఉన్నాయని వెల్లడించింది. నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య తగ్గిన తర్వాత, నకిలీ రూ.500 నోట్ల సంఖ్య పెరిగింది. వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పుడు నకిలీ రూ.2,000 నోట్ల ప్రసరణ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9,806గా ఉన్న నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 26,035కి పెరిగింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3,508కి బాగా తగ్గింది. నకిలీ నోట్లు తయారు చేస్తున్న కేటుగాళ్లు తమ దృష్టిని చలామణిలో లేని రూ.2,000 నోట్ల నుండి విస్తృతంగా చెలామణిలోకి వచ్చిన రూ.500 నోట్ల వైపు మళ్లించారని ఈ డేటా ద్వారా తెలుస్తోంది.
Read Also:Raipur: ఎక్కడా..ప్లేస్ దొరకలేదా.. కారులో శృంగారం చేస్తూ దొరికిన ప్రవచనకర్త
నకిలీ నోట్ల చెలామణిని నియంత్రించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సహకారంతో కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలను నిరంతరం సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం, నకిలీల నుండి ముందుండడానికి కొత్త డిజైన్లు, భద్రతా మెరుగుదలలను ప్రవేశపెట్టడం నిరంతర ప్రక్రియ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
-
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
-
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..