Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
- డేటా విడుదల చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు దేశంలో నకిలీ నోట్లు ఎక్కువవుతోంది. ఎక్కువగా 500రూపాయల నోటే ఎక్కువగా చెలామణిలో ఉందని ఆర్బీఐ గుర్తించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ డేటా ప్రకారం, కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నుండి నకిలీ రూ. 500 నోట్ల గుర్తింపు 2024–25లో 1,17,722 కి పెరిగింది , 2023–24లో 85,711, 2022–23లో 91,110తో పోలిస్తే ఇది పెరిగింది.
Read Also: Harassment: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. గళ్లపట్టి పీఎస్ కు లాక్కెళ్లిన మహిళ
Also Read
2024-25 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ సిరీస్ రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య 1,17,722 కు పెరిగింది. గత సంవత్సరాల్లో గుర్తించిన సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 91,110 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 85,711 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి.
Read Also:Wedding-Fraud: పెళ్లి పేరుతో యువకుడిని మోసం చేసి మహిళ.. నిందితుల అరెస్ట్
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో అత్యంత ఎక్కువగా చెలామణి అవుతున్న నోట్లలో ఎక్కువగా 500రూపాయల నోట్లే ఉన్నాయని వెల్లడించింది. నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య తగ్గిన తర్వాత, నకిలీ రూ.500 నోట్ల సంఖ్య పెరిగింది. వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పుడు నకిలీ రూ.2,000 నోట్ల ప్రసరణ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9,806గా ఉన్న నకిలీ రూ.2,000 నోట్ల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 26,035కి పెరిగింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 3,508కి బాగా తగ్గింది. నకిలీ నోట్లు తయారు చేస్తున్న కేటుగాళ్లు తమ దృష్టిని చలామణిలో లేని రూ.2,000 నోట్ల నుండి విస్తృతంగా చెలామణిలోకి వచ్చిన రూ.500 నోట్ల వైపు మళ్లించారని ఈ డేటా ద్వారా తెలుస్తోంది.
Read Also:Raipur: ఎక్కడా..ప్లేస్ దొరకలేదా.. కారులో శృంగారం చేస్తూ దొరికిన ప్రవచనకర్త
నకిలీ నోట్ల చెలామణిని నియంత్రించడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సహకారంతో కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలను నిరంతరం సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934లోని సెక్షన్ 25 ప్రకారం, నకిలీల నుండి ముందుండడానికి కొత్త డిజైన్లు, భద్రతా మెరుగుదలలను ప్రవేశపెట్టడం నిరంతర ప్రక్రియ అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!